Chiranjeevi: సతీమణిపై చిరంజీవి స్పెషల్‌ పోస్ట్‌.. ఫొటో వైరల్‌

తన సతీమణి సురేఖపై చిరంజీవి చిన్న కవిత రాశారు. అది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Updated : 18 Feb 2024 15:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తన సతీమణి సురేఖ (Surekha)పై ఉన్న ప్రేమను కవిత రూపంలో వ్యక్తం చేశారు ప్రముఖ హీరో చిరంజీవి (Chiranjeevi). ఆమె పుట్టినరోజుని పురస్కరించుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టి, శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ. హ్యపీ బర్త్‌డే’’ అంటూ స్పెషల్‌గా విష్‌ చేశారు. ఈ మేరకు ఆమెతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. చిరు రాసిన కవితకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, ఆయన షేర్‌ చేసిన పిక్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు సురేఖకు విషెస్‌ చెబుతున్నారు. మరోవైపు, తన అత్తయ్య జన్మదినం సందర్భంగా ‘అత్తమ్మ కిచెన్‌’ పేరిట ఫుడ్‌ బిజినెస్‌ ప్రారంభించినట్లు ఉపాసన ప్రకటించారు.

బిజీ లైఫ్‌కు కాస్త విరామం ఇచ్చిన చిరంజీవి సతీసమేతంగా కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లారు. విహార యాత్రలతోపాటు పలు వేడుకల్లోనూ వారు పాల్గొంటున్నారు. ఇటీవల.. నిర్మాత కుమార్‌ కోనేరు తనయుడు కిరణ్‌ వివాహానికి హాజరైనట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. అక్కడ దిగిన ఫొటోలను పంచుకున్నారు. వాటిలో ప్రముఖ హీరో వెంకటేశ్‌, నిర్మాతలు అల్లు అరవింద్‌, టీజీ విశ్వప్రసాద్‌ తదితరులు కనిపించారు. పద్మవిభూషణ్‌ పురస్కారం వరించిన సందర్భంగా చిరంజీవికి అమెరికాలో సన్మానం చేసేందుకు టీజీ విశ్వప్రసాద్‌ సన్నాహాలు చేస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే.. ఇండియాకు తిరిగొచ్చిన అనంతరం చిరంజీవి ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రీకరణలో పాల్గొంటారు. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్రిష హీరోయిన్‌. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని