Alaya F: నా స్థానంలో ఎవరున్నా బాధపడేవారు

బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన బయోపిక్‌ ‘శ్రీకాంత్‌’తో మంచి విజయాన్ని అందుకుంది యువకథానాయిక అలయా ఎఫ్‌. 2020లోనే తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈమె అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీఖాన్, రాజ్‌కుమార్‌ రావ్‌ లాంటి మంచి హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది.

Published : 25 May 2024 01:00 IST

బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన బయోపిక్‌ ‘శ్రీకాంత్‌’తో మంచి విజయాన్ని అందుకుంది యువకథానాయిక అలయా ఎఫ్‌. 2020లోనే తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఈమె అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీఖాన్, రాజ్‌కుమార్‌ రావ్‌ లాంటి మంచి హీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలయా.. జీవితంలో పెట్టుకున్న షరతులను పాటిస్తేనే విజయం దక్కుతుందని అనుకోనంటూ చెప్పుకొచ్చింది. ‘ఒక నటిగా నేను చాలా ఎదిగానని నాకనిపిస్తుంది. దర్శకులు అలా తీర్చిదిద్దారు. అలాంటి మంచి దర్శకులతో పనిచేశాను. సవాళ్లు విసిరే పాత్రలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటా. అలాంటి పాత్రలు చేయడం, దానికి తగ్గట్టు సెట్లో సమయం గడపటానికే ఇష్టపడతాను. సవాళ్లతో కూడిన పాత్రలే ఉత్తేజపరుస్తాయి’ అంటూ తెలిపింది. ‘నా తొలి చిత్రం ‘జవానీ జానేమన్‌’ విడుదలైన కొద్ది రోజులకే లాక్‌డౌన్‌ విధించారు. ఇలాంటి పరిస్థితి ఇంకే నటీనటులకి వచ్చిన బాధపడేవారేమో. కానీ నేను..నా మొదటి సినిమా థియేటర్లలో విడుదలైందని చాలా ఆనందించా’ అని అంది. ‘చిత్రపరిశ్రమకి వచ్చిన కొద్దిరోజులకే స్టార్‌డమ్‌ కోరుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఇందులో రాణించాలంటే ఓపిక ఉండాలి. ఈ రంగంలోకి వచ్చాకా నేనదే నేర్చుకున్నాను. జీవితంలో జరగాల్సినవి సమయం వచ్చినప్పుడే జరుగుతాయి. స్టార్‌డమ్‌ రావడానికి ఎంతో సమయం పట్టదు. అదంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని నా అభిప్రాయం’ అంటూ ముచ్చటించింది అలయా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని