Guntur Kaaram: ‘గుంటూరు కారం’పై భారత క్రికెటర్‌ ప్రశంసలు

మహేశ్‌బాబు - శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రంపై తాజాగా భారత క్రికెటర్‌ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించారు.

Published : 20 Mar 2024 11:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) నటించిన సరికొత్త చిత్రం ‘గుంటూరు కారం’(Guntur Kaaram)పై ప్రశంసల వర్షం కురిపించారు భారత స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్ (Ashwin). ఇదొక వినోదాత్మక చిత్రమన్నారు. తనకెంతో నచ్చిందన్నారు. ప్రధాన నటీనటుల డ్యాన్స్‌ చూసి ఆశ్చర్యపోయానన్నారు. ‘‘మహేశ్‌ నటించిన ‘గుంటూరుకారం’ చూడకపోతే చూడండి. ఎంటర్‌టైనింగ్‌ మూవీ. శ్రీలీల డ్యాన్స్‌ అదరగొట్టేసింది. మహేశ్‌బాబు మంచి డ్యాన్సర్‌. ఆయనతో కలిసి శ్రీలీల అద్భుతంగా డ్యాన్స్‌ చేసింది’’ అని ఓ ఇంటర్వ్యూలో అశ్విన్‌ చెప్పారు.

మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రమిది. తల్లి సెంటిమెంట్‌తో యాక్షన్‌ డ్రామాగా దీనిని తీర్చిదిద్దారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ, జయరాం, మురళీ శర్మ, రావు రమేశ్‌ కీలకపాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనలు సొంతం చేసుకుంది. ‘కుర్చీమడతపెట్టి’ పాటలో మహేశ్‌బాబు - శ్రీలీల డ్యాన్స్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని