Vamshi Paidipally: బాలీవుడ్‌ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?

‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్‌ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు.

Published : 25 Apr 2024 16:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: తన తదుపరి సినిమాని బాలీవుడ్‌ హీరోతో తెరకెక్కించనున్నట్లు వస్తున్న వార్తలపై టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అవి రూమర్స్    అని కొట్టిపారేశారు. ‘మరి, మీ నెక్స్ట్‌ ప్రాజెక్టు ఏ నేపథ్యంలో ఉంటుంది? ఏ భాషలో తెరకెక్కనుంది?’ అని అడగ్గా.. ఆ వివరాలు పంచుకునేందుకు ఇంకా టైమ్‌ ఉందని, ప్రస్తుతానికి ఏదీ రివీల్‌ చేయలేనన్నారు. సరైన సమయంలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

షాహిద్‌ కపూర్‌ (Shahid Kapoor) హీరోగా వంశీ పాన్‌ఇండియా స్థాయిలో ఓ సినిమాని రూపొందించనున్నారని, ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దాన్ని నిర్మించనున్నారని బుధవారం ప్రచారం జరిగింది. వంశీ బాలీవుడ్‌ ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారని సోషల్‌మీడియా ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లోనూ పోస్ట్‌లు కనిపించాయి. ‘మున్నా’తో డైరెక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన వంశీ ఆ తర్వాత ‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’, ‘మహర్షి’లతో ప్రేక్షకులను మెప్పించారు.  కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘వారిసు’(వారసుడు) గతేడాది సంక్రాంతికి విడుదలై సందడి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని