Miss Shetty Mr Polishetty: నవీన్‌.. వియత్నాంలో షో వేయించవచ్చుగా మావ: నిఖిల్‌

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) విజయాన్ని ఉద్దేశిస్తూ చిత్ర హీరో నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty), నటుడు నిఖిల్‌ (Nikhil) మధ్య ఓ సరదా సంభాషణ చోటుచేసుకుంది.

Published : 13 Sep 2023 14:32 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ నటులు నిఖిల్‌ (Nikhil), నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) మధ్య తాజాగా ఓ సరదా సంభాషణ చోటుచేసుకుంది. ట్విటర్‌ వేదికగా.. ‘మిస్ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) విజయాన్ని ఉద్దేశిస్తూ వీరిద్దరూ ట్వీట్స్‌ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగి సంభాషణ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. నవీన్‌ కామెడీ టైమింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

తన సరికొత్త చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’కి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ నవీన్‌ ఇటీవల ఓ ట్వీట్‌ చేశారు. దీనిపై తాజాగా నిఖిల్‌ (Nikhil) స్పందించారు. తన కోసం వియత్నాంలో ఓ షో వేయించమని కోరారు. ‘‘హేయ్‌ మావ.. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో విజయం అందుకున్నందుకు కంగ్రాట్స్‌. నీ విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నా. వియత్నాంలో ఉండటం వల్ల నేను ఈ చిత్రాన్ని చూడలేకపోయా. ఇక్కడ కూడా ఒక షో చేయించవచ్చుగా. మీ చిత్రబృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు’’ అని ఆయన పేర్కొన్నారు.

AR Rahman: రెహమాన్‌ కాన్సర్ట్‌ వివాదం... తీవ్రంగా పరిగణించిన హోంశాఖ

కాగా, దీనిపై నవీన్‌ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్స్‌ బ్రో. వియత్నాంలోనా? తప్పకుండా షో వేయిస్తా అడ్రస్‌ పెట్టు. నువ్వు ముందు అడ్రస్‌ పెట్టు (నవ్వులు). నువ్వెప్పుడు ఇండియాకు తిరిగి వస్తావ్‌..? నా సినిమా పట్ల నీ అభిప్రాయం తెలుసుకోవడానికి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

డీసెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’. మహేశ్‌బాబు దర్శకుడు. అనుష్క, నవీన్‌ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా సూపర్‌హిట్‌ అందుకుంది. ఇక, నిఖిల్‌ విషయానికి వస్తే.. తన తదుపరి చిత్రం ‘స్వయంభు’ కోసం ఆయన సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక శిక్షణ కోసం ఇటీవల ఆయన వియత్నాం వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని