AR Rahman: రెహమాన్ కాన్సర్ట్ వివాదం... పోలీసు అధికారులపై చర్యలు..
ఏ.ఆర్.రెహమాన్ (AR rahman) కాన్సర్ట్ వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన కారణంగా ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు.
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) ఇటీవల చెన్నై వేదికగా నిర్వహించిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్ తీవ్ర వివాదానికి తెర తీసిన విషయం తెలిసిందే. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా కాన్సర్ట్ ప్రాంగణంలో తొక్కిసలాట, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ తలెత్తడంతో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. తమతో కొంత మంది అనుచితంగా ప్రవర్తించారని ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో పలువురు ఫిర్యాదు చేశారు కూడా. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను ఆ రాష్ట్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు ప్రారంభించింది.
దిశా మిత్తల్, దీపా, ఆదర్శ్ అనే ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వారికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అలాగే తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ మరో ఇద్దరు అధికారులను సైతం సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. కాన్సర్ట్ జరిగిన ప్రాంగణం వద్ద ఆయా అధికారులు సరిగ్గా విధులు నిర్వర్తించకపోవడం వల్లే ఇబ్బందులు పడ్డామంటూ పలువురు ఆరోపణలు చేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘సలార్’ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
సెప్టెంబర్ 10వ తేదీన సాయంత్రం చెన్నైలోని ఆదిత్యరామ్ ప్యాలెస్ వేదికగా రెహమాన్ కాన్సర్ట్ జరిగింది. తమ అభిమాన సంగీత దర్శకుడి పాటలను లైవ్లో వినొచ్చని ఆనందంతో అక్కడికి వెళ్లినవారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సీట్లు లేక, పార్కింగ్ సౌకర్యం సరిగ్గా లేక చాలా మంది అవస్థలు పడ్డారు. గోల్డ్ పాసులు ఉన్నప్పటికీ కొంతమందిని అనుమతించలేదు. దీంతో చాలామంది అక్కడి నుంచి వెనుదిరిగారు. ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే పరిసర ప్రాంతాల్లో ట్రాపిక్ ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా ట్రాఫిక్లో చిక్కుకున్నట్లు వార్తలు వచ్చాయి. పలువురు నెటిజన్లు రెహమాన్, నిర్వాహకులను తిడుతూ నెట్టింట ఫిర్యాదులు చేశారు. ఈ విషయంపై రెహమాన్ క్షమాపణలు చెప్పారు. కాన్సర్ట్కు హాజరు కాలేకపోయిన వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
తనను ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు. -
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
తనపై కొందరు ట్రోల్స్ చేయడం బాధగా ఉందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. -
విమర్శలు వచ్చినా.. ‘యానిమల్’ హిట్కు కారణమిదే: మనోజ్ బాజ్పాయ్
సినిమాలు చూడాలా, లేదా అనే విషయంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ అన్నారు. -
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. -
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
పారితోషికం విషయంలో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారని నటి సోనాక్షి సిన్హా అన్నారు. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్
-
కేజ్రీవాల్ ఇంటి నుంచి వీడియో వెలుగులోకి.. ‘హిట్మ్యాన్’ అంటూ స్వాతీమాలీవాల్ పోస్టు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్