aadi sai kumar: కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే.
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. దిగంగన సూర్యవంశీ కథానాయిక. తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్రాజు క్లాప్నివ్వగా, నటుడు సాయికుమార్ కెమెరా స్విచ్చాన్ చేయడంతోపాటు చిత్రబృందానికి స్క్రిప్ట్ని అందజేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కథానాయకుడు ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘‘నేను, వీరభద్రమ్ చౌదరి కలిసి ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత మరో సినిమా చేయాలని ప్రయత్నించాం. ఇన్నాళ్లకి ఓ మంచి కథ కుదిరింది. కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందీ చిత్రం. జూన్ నుంచి చిత్రీకరణ మొదలు పెడతాం. ‘క్రేజీ ఫెలో’ తర్వాత నేను, దిగంగన సూర్యవంశీ కలిసి చేస్తున్న చిత్రమిది. అనూప్ రూబెన్స్ నా సినిమాలకి మంచి పాటలు ఇస్తుంటారు. మరోసారి ఆయనతో కలిసి సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి అన్నీ కలిసొచ్చాయి. మంచి కథతో, ఆద్యంతం వినోదం పంచేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఆది, దిగంగన జోడీ బాగుంటుంది. ఇందులో కథానాయికకీ బలమైన పాత్ర కుదిరింది. రాము సంభాషణలు, శ్యామ్ విజువల్స్తోపాటు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాల్ని తీస్తారు వీరభద్రమ్ చౌదరి. ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ కూడా అలాంటిదే. ఎంతో తపన ఉన్న నిర్మాతలు, మంచి కథతో ఈ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది’’ అన్నారు సాయికుమార్. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి