ఆ వార్తలు నిరాధారం
‘హనుమాన్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడాయన బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
‘హనుమాన్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పుడాయన బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ రద్దయినట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చిన నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం స్పందించింది. సృజనాత్మక విభేదాల వల్ల ఈ చిత్రం ఆగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని.. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్తో పాటు ఇటీవలే ఫొటో, ప్రోమో షూట్ పూర్తయిందని వెల్లడించింది. ఈ ప్రోమో జూన్ ఆఖరి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. టైటిల్తో పాటు మరిన్ని వివరాలపై అప్పుడే స్పష్టత రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కమల్ హాసన్ బయోపిక్.. శ్రుతి హాసన్ రియాక్షనిదే
కమల్ హాసన్ బయోపిక్కు దర్శకత్వం వహించడంపై శ్రుతి హాసన్ మాట్లాడారు. తన దృష్టిలో ఆయన సూపర్ హీరో అన్నారు. -
తుపాను ముందు నిశ్శబ్దం.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కేవలం వారం ముందు వచ్చేందుకు పెద్ద సినిమాలేవీ ఆసక్తి చూపకపోవడంతో చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్లో రాబోతున్న ఆ సినిమాలేంటి? ఓటీటీలో ఏయే చిత్రాలు అలరించనున్నాయి? -
వీరుడినే... యోధుడినే
నా గమనం... నిత్య రణం అంటూ నినదిస్తున్నాడు భైరవ. మరి ఆయన కథేమిటో తెలియాలంటే ‘కల్కి 2898 ఎ.డి’ చూడాల్సిందే. -
సొంతింటికి వచ్చినట్టుగా ఉంది
బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ జంటగా రకుల్ప్రీత్ సింగ్ నటిస్తున్న చిత్రం ‘దే దే ప్యార్ దే 2’. విజయవంతమైన ‘దే దే ప్యార్ దే’కి కొనసాగింపుగా అన్షుల్ శర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. -
నాన్న.. గోరుముద్ద
ఓ తండ్రిగా తన గారాలపట్టి క్లీంకారతో గడిపే ప్రతిక్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా అన్నారు కథానాయకుడు రామ్చరణ్. ఆయన ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా తన ముద్దుల తనయతో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ.. నాన్నగా తన ప్రయాణంలోని మధురానుభూతుల్ని గుర్తు తెచ్చుకున్నారు. -
అలియాతో తెర పంచుకోవడం పెద్ద బాధ్యత!
అలియాతో కలిసి నటించడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నానంటోంది బాలీవుడ్ కథానాయిక శార్వరీ వాఘ్. ఇటీవలే విడుదలైన ‘ముంజ్యా’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. త్వరలో ఓ యాక్షన్ చిత్రంలో మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది. -
‘సితారే జమీన్ పర్’ ముగిసింది
బుద్ధిమాంద్యం పిల్లల్లోని అసాధారణ ప్రతిభను వెలికితీయాలనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘తారే జమీన్ పర్’. -
ఎన్టీఆర్ పురస్కారాలు 29న ప్రదానం
కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ వేడుకని ఈ నెల 29న హైదరాబాద్లో నిర్వహించనున్నారు. కళావేదిక, రాఘవి మీడియా సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో సినిమా రంగంలోని వివిధ విభాగాలకు చెందిన కళాకారులకు పురస్కారాల్ని ప్రదానం చేయనున్నారు. -
‘వెల్కమ్’ రాక ఆలస్యం
అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. ‘వెల్కమ్’ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో భాగమిది. -
శ్రీలీల ‘డ్రిప్పిన్’ కల్చర్.. రోజీ చీరలో మంజిమా..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం..
తాజా వార్తలు (Latest News)
-
సమయం వచ్చేసింది.. నా ప్రవేశం ప్రారంభమైంది.. శశికళ కీలక వ్యాఖ్యలు
-
రెండు గ్రూప్లుగా సూపర్-8.. ఆ టీమ్లు ఇవే
-
కమల్ హాసన్ బయోపిక్.. శ్రుతి హాసన్ రియాక్షనిదే
-
ప్రధాని మోదీని కెనడాలో జీ7కు ఆహ్వానిస్తారా..? ట్రూడో ఏమన్నారంటే..
-
ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ
-
తుపాను ముందు నిశ్శబ్దం.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!