వినోదం + సందేశం
‘కె.జి.ఎఫ్’ చిత్రాలతో కథానాయకుడు యశ్ పేరు మార్మోగిపోయింది. అప్పట్నుంచి ఆయన పాత సినిమాలన్నీ అనువాదాలై, వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఆయన కన్నడలో చేసిన చిత్రాల్లో ‘రాజధాని’ ఒకటి.
‘కె.జి.ఎఫ్’ చిత్రాలతో కథానాయకుడు యశ్ పేరు మార్మోగిపోయింది. అప్పట్నుంచి ఆయన పాత సినిమాలన్నీ అనువాదాలై, వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఆయన కన్నడలో చేసిన చిత్రాల్లో ‘రాజధాని’ ఒకటి. అది ‘రాజధాని రౌడీ’ పేరుతో ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో యశ్కి జోడీగా షీనా నటించారు. నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ ‘‘వినోదం, సందేశం మేళవింపుగా... నలుగురు యువకుల చుట్టూ సాగే కథ ఇది. ప్రకాశ్రాజ్ ఓ శక్తిమంతమైన పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారు. ముమైత్ఖాన్ తన అందచందాలతో కనువిందు చేస్తారు. అర్జున్ జన్య సంగీతం కీలకం. ఇలాంటి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు.
రాయన్ రాక ఆలస్యం..
‘‘తలవంచి ఎరుగడే.. తలదించి నడువడే.. తన పేరే విజయుడే’’ అంటూ ఇటీవలే ‘రాయన్’ సినిమాలోని తన పాత్రను ప్రేక్షకులను పరిచయం చేశారు కథానాయకుడు ధనుష్. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సందీప్ కిషన్, ఎస్జే సూర్య, కాళిదాస్ జయరామ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దీన్ని జూన్లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా జులై 26న రాబోతున్నట్లు తెలుపుతూ.. ఇన్స్టా వేదికగా కొత్త పోస్టర్ను పంచుకుంది.
కాలభైరవ స్వరాలతో ‘యుఫోరియా’
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇటీవలే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘యుఫోరియా’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాని గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడిగా కాలభైరవను ఖరారు చేశారు. ఈ విషయాన్ని సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.
ఆరు భాషల్లో... వరదరాజు గోవిందం
రవి జంగు, ప్రీతి కొంగన జంటగా... సముద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరదరాజు గోవిందం’. వి.సాయి అరుణ్ కుమార్ నిర్మాత. ఆగస్టులో ఆరు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా హైదరాబాద్లో టీజర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు సుమన్, దర్శకులు రేలంగి నరసింహారావు, ముప్పలనేని శివ, చంద్రమహేశ్, రవికుమార్ చౌదరి, శివనాగు, నగేశ్ నారదాసి, గోసంగి సుబ్బారావు, అమ్మరాజశేఖర్, నిర్మాతలు టి.ప్రసన్నకుమార్, కె.దామోదర్ ప్రసాద్, కేకే రాధామోహన్, డి.ఎస్.రావు, శోభారాణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ‘‘శ్రీకృష్ణుడితో ముడిపడిన అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించాం’’ అన్నారు.
సీతాకోకై ఎగిరింది మనసే..
చిమటా రమేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తూ... దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనే కీర్తన’. రిషిత, మేఘన కథానాయికలు. చిమటా లక్ష్మీకుమారి నిర్మాత. చిమటా జ్యోతిర్మయి సమర్పకులు. ఈ సినిమాలోని ‘సీతాకోకై ఎగిరింది మనసే...’ అంటూ సాగే పాటని దర్శకనిర్మాత సాయిరాజేశ్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘పాట బాగుంది. చిత్రంలో సక్సెస్ కళ కనిపిస్తోంది. కథానాయకుడు, దర్శకుడికీ ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. చిమటా రమేశ్ బాబు మాట్లాడుతూ ‘‘బహుళ నేపథ్యాలున్న కథని ఎంచుకుని చేసిన చిత్రమిది. కథనం కూడా కొత్తగా ఉంటుంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాట, ఆరు పోరాట ఘట్టాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. సంధ్య, జీవా, విజయ రంగరాజు, బబర్దస్త్ అప్పారావు, సన్నీ, రాజ్కుమార్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె.రమణ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్