Harish Shankar: ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ ఇప్పటి వరకు 20 రోజులే షూటింగ్‌..!

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్‌పై తాజాగా ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. దానికి హరీశ్‌ శంకర్ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Published : 07 Nov 2023 15:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ దర్శకుడు హరీశ్ శంకర్‌ తన సినిమా అప్‌డేట్‌లను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటారు. అలాగే తన సినిమాలపై వచ్చే రూమర్స్‌కు కూడా ఎప్పటికప్పుడు చెక్ పెడుతుంటారు. తాజాగా పవన్‌ కల్యాణ్‌తో ఆయన తీస్తోన్న ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) షూటింగ్‌పై ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు హరీశ్‌ శంకర్‌.

పవన్‌ కల్యాణ్- హరీశ్ శంకర్‌ల కాంబోలో రూపొందుతోన్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్‌పై ఓ నెటిజన్‌ ట్వీట్ చేశారు. ‘ఇప్పటి వరకు ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ షూటింగ్ 20రోజులు మాత్రమే అయింది. జనవరి నుంచి రవితేజ సినిమా పనుల్లో హరీశ్ శంకర్‌ బిజీ కానున్నారు’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన దర్శకుడు.. ‘రెండు అప్‌డేట్‌లు తప్పే. ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిది’ అని రాశారు. దీంతో ఎన్నో రోజులుగా హరీశ్ శంకర్‌, రవితేజ (Ravi Teja) కాంబోలో ఓ సినిమా రానుందనే వార్తలకు చెక్‌ పడింది. ఇక ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్’ షూటింగ్‌ విషయానికొస్తే.. ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని హరీశ్ శంకర్‌ గతంలోనే చెప్పారు. ఇందులో పవన్‌ కల్యాణ్ ఎప్పటిలాగే పవర్‌ ఫుల్‌గా నటించారంటూ పేర్కొన్నారు.

టెక్నాలజీ చూస్తే భయమేస్తోంది.. రష్మిక మార్ఫింగ్‌ వీడియోపై నాగచైతన్య

‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) - హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల నటిస్తోంది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మొదట డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి దీన్ని నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని