Hyper Aadi: తరాలు మారితే టెక్నాలజీ మారుతుంది.. బాలయ్య ఎనర్జీ కాదు: హైపర్ ఆది
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైపర్ ఆది.. బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: నందమూరి నటసింహం (బాలకృష్ణ), కొణిదెల కొదమసింహం (పవన్ కల్యాణ్) కలిసి అసెంబ్లీలో అడుగుపెడితే ఎలా ఉంటుందో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమా చూసినా అలానే ఉంటుందన్నారు నటుడు హైపర్ ఆది (Hyper Aadi). విష్వక్సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రమిది. నేహాశెట్టి, అంజలి హీరోయిన్లు. ఆది కీలక పాత్ర పోషించారు. మే 31 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో మంగళవారం నిర్వహించింది. ప్రముఖ నటుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన్ను ఉద్దేశిస్తూ ఆది మాట్లాడారు.
‘‘ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నేను తెలుగు వాడిని అని గర్వంగా, ధైర్యంగా చెప్పుకొంటున్నామంటే దానికి కారణం నందమూరి తారక రామారావు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ, శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ని భావించి ఆయన ఫొటోలు ఇంట్లో పెట్టాం. శ్రీరాముడిగా భావించి చేతులెత్తి ఆయనకు దండం పెట్టాం. ఆయన గాంభీర్యం చూడాలంటే ‘బొబ్బిలి పులి’లోని కోర్టు సన్నివేశం ఒక్కటి చాలు. అలాంటి నటుడు, రాజకీయ నాయకుడు మళ్లీ పుట్టరు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకోవడం ఓ అదృష్టంగా భావిస్తున్నా. తెలుగుజాతి గౌరవాన్ని రామారావుగారు కాపాడితే.. ఆయన గౌరవాన్ని బాలకృష్ణగారు నిలబెడుతూ వస్తున్నారు. ‘బాలకృష్ణ తిట్టారు.. కొట్టారు’ అంటూ కొందరు వార్తలు రాస్తుంటారు. కానీ, ఆయన కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులను నిలబెట్టారు. దాని గురించి రాయాలి. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మంది పేద వారికి సాయం చేశారు. బాలకృష్ణగారితో పనిచేసే ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉంటాయి’’
‘‘ఒక జనరేషన్ వాళ్లు మాకు గుర్తుండిపోయే చిత్రాలు కావాలని అడిగితే ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’లాంటి చిత్రాలు ఇచ్చారాయన. మరో జనరేషన్ వాళ్లు యాక్షన్ సినిమాలు కావాలంటే ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహారెడ్డి’లాంటివి అందించారు. ఇంకో జనరేషన్ వాళ్లు కాలర్ ఎగరేసే సినిమాలు అడిగితే ‘సింహా’లాంటివి ఇచ్చారు. జనరేషన్ మారితే మనుషులు మారతారు.. టెక్నాలజీ మారుతుంది.. కానీ, బాలయ్య బాబు ఎనర్జీ మారదు. ఆయన గ్రాఫ్ పెరగడమే తప్ప తగ్గదు. ఆయన సినిమాల్లో, ఓటీటీలో, రాజకీయాల్లో, సేవ చేయడంలో అన్స్టాపబుల్. ఆయన రాకతో మా సినిమా కలెక్షన్స్ కూడా అన్స్టాపబుల్ అవ్వాలని కోరుకుంటున్నా’’
‘‘విష్వక్ సేన్ మంచి నటుడు. అందుకే ఆయన చిత్రాలకు నష్టాలు రావు. 24 క్రాఫ్ట్స్పై పట్టున్న వ్యక్తి. మనందరికీ త్రివిక్రమ్ అంటే ఇష్టం. ఆయనకు మా దర్శకుడు కృష్ణ చైతన్య అంటే ఇష్టం. అంజలి, నేహాశెట్టి అద్భుతంగా నటించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చే వారికి నాదో విజ్ఞప్తి.. నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని రివ్యూలు రాయండి. ఎందుకంటే ఒక సినిమా విజయం అందుకోకపోతే హీరో మనోధైర్యంతో మరో సినిమా చేయొచ్చు. ప్రొడ్యూసర్ మనోధైర్యంతోపాటు మనీ కూడా తెచ్చుకోవాలి. తెలుగు సినిమాని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. ఒక హీరోని అభిమానిస్తే మరో హీరోకి వ్యతిరేకమేమో అని అనుకునే వారికి ఓ మాట చెబుతున్నా.. మాకు తెలుగు సినిమా అంటే పిచ్చి, తెలుగు హీరోలంటే పిచ్చి. ఇండస్ట్రీ బాగుంటే అందరం బాగుంటామని భావిస్తాం’’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
‘దేవర’ సాంగ్ అప్డేట్ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ఏమన్నారంటే?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా సాంగ్ అప్డేట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్. -
నిజమైన సింహంతో ఫస్ట్ ఆసియా ఫిల్మ్.. ‘మాంబో’!
‘అరణ్య’తో అలరించిన దర్శకుడు ప్రభు సాల్మన్ మరో సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
తనే నిజం చెబితే బాగుంటుంది: రాజ్ తరుణ్ ఇష్యూపై డైరెక్టర్ రవికుమార్
రాజ్ తరుణ్ ఇష్యూపై దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ స్పందించారు. రాజ్ తరుణ్ హీరోగా రవికుమార్ తెరకెక్కించిన చిత్రం ‘తిరగబడర సామీ’ త్వరలోనే విడుదల కానుంది. -
అందుకే రాజ్ తరుణ్ను హీరోగా తీసుకున్నా: ‘పురుషోత్తముడు’ డైరెక్టర్
రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ప్రచారంలో భాగంగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
రాజ్తరుణ్ వల్ల ‘పురుషోత్తముడు’ బిజినెస్ లాస్ అయిందా?.. నిర్మాత ఏమన్నారంటే!
‘పురుషోత్తముడు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. రాజ్తరుణ్ వల్ల సినిమా బిజినెస్ లాస్ అయిందా?అనే ప్రశ్నకు నిర్మాత రమేశ్ సమాధానమిచ్చారు. -
‘రాజాసాబ్’పై తమన్ ఆసక్తికర కామెంట్స్.. ఏం అప్డేట్ ఇచ్చారంటే?
ప్రభాస్ ‘రాజాసాబ్’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. -
లీక్స్పై స్పందించిన ‘వీడీ 12’ టీమ్.. సోషల్ మీడియాలో పోస్ట్
లీక్స్ రావడంపై ‘వీడీ 12’ టీమ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. -
అది చిన్న విషయం కాదు: ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్పై పూరి జగన్నాథ్
తన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’లోని ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. -
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా?: ప్రశ్నించిన అనిల్ రావిపూడి
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా? అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశ్నించారు. ఏం జరిగిందంటే? -
ఎన్టీఆర్పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రశంసలు: ‘దేవర’ సాంగ్ గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్పై కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. -
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబో.. సర్ప్రైజ్ అదిరింది
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘సూర్య 44’ (వర్కింగ్ టైటిల్). సూర్య పుట్టినరోజు సందర్భంగా టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. -
వీటి ఆధారంగా ‘కల్కి’ రెండు భాగాలు: ఫొటో పంచుకున్న నాగ్ అశ్విన్
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. -
ఆర్ఆర్ఆర్ను బీట్ చేసిన కల్కి 2898 ఏడీ.. వసూళ్లు ఎంతంటే?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను అధిగమించింది. -
రెండు సినిమాల అప్డేట్స్ చెప్పిన రజనీకాంత్.. ‘ఇండియన్ 2’ గురించి ఏమన్నారంటే!
తన అప్కమింగ్ సినిమాల అప్డేట్లను రజనీకాంత్ పంచుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఈ వారం థియేటర్లో వినోదాల విందు.. మరి ఓటీటీలో..!
‘కల్కి’ తర్వాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. జులై చివరిలో మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి థియేటర్తో పాటు ఓటీటీలో వస్తున్న ఆ చిత్రాలేంటో చూసేయండి. -
రీమేక్ అంటూ నెటిజన్ కామెంట్: స్పందించిన హరీశ్ శంకర్
తన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. హరీశ్ శంకర్ స్పందించారు. -
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అప్పుడే.. దిల్ రాజు ప్రకటన
‘గేమ్ ఛేంజర్’ విడుదలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఏమన్నారంటే? -
ధనుష్ ఇచ్చిన ఛాన్స్.. అదే నాకు అవార్డు: సందీప్ కిషన్ ఎమోషనల్ స్పీచ్
‘రాయన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ఎమోషనల్గా మాట్లాడారు. ధనుష్పై ప్రశంసలు కురిపించారు. -
‘మిస్టర్ బచ్చన్’ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇప్పటికే పలు చిత్రాలు సిద్ధమవగా సడెన్గా ‘మిస్టర్ బచ్చన్’ విడుదల తేదీ ఖరారైంది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘పుష్ప 2’ రూమర్స్పై స్పందించిన బన్నీ వాసు.. అందుకే గడ్డం తీసేశారు!
‘పుష్ప 2’ రూమార్స్ గురించి నిర్మాత బన్నీ వాసు ఏమన్నారంటే?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత