Vijay Sethupathi: ఆ లేబుల్‌ నాకు అవసరం లేదు: విజయ్‌ సేతుపతి

‘మెరీ క్రిస్మస్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా విలేకరులతో మాట్లాడారు నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi). ఈ సినిమా ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందిస్తుందన్నారు.

Published : 06 Jan 2024 18:16 IST

ముంబయి: సింప్లిసిటీ లేబుల్‌ తనకు ఇవ్వొద్దని నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) అన్నారు. తాను ధరించే దుస్తులు ఖరీదైనవని తెలిపారు. ‘‘నేను నిరాడంబరంగా ఉంటానని ప్రేక్షకులు అనుకుంటారు. అది నిజం కాదు. సౌకర్యవంతంగా అనిపించే దుస్తులను మాత్రమే ధరిస్తుంటా. ఖరీదైనవే వేసుకుంటా. కాబట్టి, సింప్లిసిటీ అనేది నాకు వర్తించదు. దయచేసి ఆ లేబుల్‌ నాకు ఇవ్వొద్దు’’ అని విజయ్ సేతుపతి తెలిపారు.

అనంతరం కత్రినాకైఫ్‌తో వర్క్‌ చేయడం గురించి మాట్లాడారు. ‘‘కత్రినాతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. ఆమెకు నేను అభిమానిని. తొలిసారి ఆమెను సెట్‌లో చూసినప్పుడు ఆనందించా. నా సంతోషాన్ని సరిగ్గా బయటపెట్టలేకపోయా. ఆమెకు ఆలోచనా శక్తి ఎక్కువ. విషయం ఏదైనా సరే.. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అందం, తెలివితోనే పరిశ్రమలో రాణిస్తున్నారు. కేవలం అందం ఒక్కటే ఉంటే పరిశ్రమలో ఇన్నేళ్లు కొనసాగడం వీలుపడదు’’ అని పేర్కొన్నారు.

Janhvi Kapoor: అలియా భట్‌ స్థానంలో జాన్వీ కపూర్‌.. క్లారిటీ ఇచ్చిన కరణ్‌ జోహార్‌

‘జవాన్‌’ తర్వాత విజయ్‌ సేతుపతి బాలీవుడ్‌లో నటిస్తోన్న చిత్రం ‘మెరీ క్రిస్మస్‌’. ఒక రాత్రి జరిగిన సంఘటన ఇద్దరి వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే థ్రిల్లర్‌ కథాంశంతో శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రీతమ్‌ స్వరాలు అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని