Devara: : ‘దేవర’ సెట్స్‌లోకి మళ్లీ జాన్వీ..!

‘దేవర’ షూటింగ్‌ కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్లు జాన్వీ కపూర్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాలో పోస్టు చేశారు. 

Published : 26 Mar 2024 15:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ కథానాయిక జాన్వీకపూర్‌(Janhvi Kapoor) ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రంలో ‘తంగం’ పాత్ర పోషిస్తున్నారు.  ఇటీవల గోవాలో ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌లో పాల్గొంటున్నట్లు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ‘‘మరోసారి తంగం పాత్రలోకి వచ్చేందుకు ఇక వేచి ఉండలేను’’ అని పోస్ట్‌ పెట్టారు.

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ (NTR) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దేవర’ (Devara). కొరటాల శివ ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. మిక్కిలినేని సుధాకర్‌, హరికృష్ణ. కె ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ దీనిలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ కథాంశంతో ఇది తెరకెక్కుతోంది. అనిరుధ్‌ సంగీత దర్శకుడు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగం ‘దేవర: పార్ట్‌ 1’ పేరుతో అక్టోబరు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అగ్ర హీరో రామ్‌ చరణ్‌-బుచ్చిబాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రంలో జాన్వీ కపూర్‌ నటించనున్నారు. మైత్రీ మూవీమేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు దీనిని నిర్మిస్తున్నాయి. ఏఆర్‌ రెహమాన్‌ దీనికి స్వరాలు అందించనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని