Janhvi Kapoor: వాళ్లతో ఎప్పటికీ డేటింగ్‌ చేయను..: జాన్వీ కపూర్‌

సెలబ్రిటీ టాక్‌షో ‘కాఫీ విత్‌ కరణ్‌’కు నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హాజరయ్యారు.

Updated : 06 Jan 2024 17:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో 8వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. తాజా ఎపిసోడ్‌కు నటి జాన్వీ కపూర్‌ తన చెల్లి ఖుషీ కపూర్‌తో హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా జాన్వీ చెప్పిన కొన్ని సమాధానాలు ఆకట్టుకున్నాయి.

‘ఎప్పుడైనా రొమాంటిక్‌ మెసేజ్‌లు వచ్చాయా?’ అని కరణ్‌ అడగ్గా.. ‘దీనికి సమాధానం చెబితే ఖుషీ నన్ను ఏడిపిస్తుంది’ అని సరదాగా చెప్పారు. ఎవరితో డేటింగ్‌ చేస్తారు..? అని ప్రశ్నించగా.. ‘సినిమా వాళ్లతో మాత్రం చేయను. డేటింగ్‌ చేసేవాళ్లకు నేనే ప్రపంచమై ఉండాలి. ప్రతి క్షణాన్ని ఎంజాయ్‌ చేయాలి. సినీ రంగంలో చాలా ఒత్తిడి ఉంటుంది. ఒకే వృత్తిలో ఉండేవాళ్లు దాన్ని బ్యాలెన్స్‌ చేయడం కష్టం’ అని చెప్పారు.

‘అర్జున్‌ రెడ్డి’ని అల్లు అర్జున్‌తో తీయాలనుకున్నా.. కానీ: సందీప్‌ వంగా

ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటోన్న జాన్వీ.. ‘దేవర’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తోన్న చిత్రమిది. సైఫ్‌ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దీని గ్లింప్స్‌ జనవరి 8న విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని