Janhvi Kapoor: గాయాలు తట్టుకోలేక.. తప్పుకొందామనుకున్నా!
కథల ఎంపికలో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ భామ..
కథల ఎంపికలో తనదైన ప్రత్యేకతను చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్. ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ భామ.. ఇటీవలే ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. ఈ చిత్రంలోని తన అనుభవాలను ఇలా పంచుకుంది.
- ‘‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ మనసును ఆకట్టుకునే భావోద్వేగాలు, మంచి విలువలతో నిర్మించిన చిత్రం. కుటుంబ సమేతంగా చూడొచ్చు. యువతకు స్ఫూర్తినిచ్చే విధంగానూ ఉంటుంది. ఒక వ్యక్తి తన కలల్ని నిజం చేసుకోవడానికి కుటుంబ తోడ్పాటు ఎంత అవసరమో ఇందులో చూపించాం’’.
- ‘‘మొదట్నుంచీ భిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూనే ముందుకు సాగుతున్నాను. కానీ.. ఇందులో మీరు మరో కొత్త జాన్వీ కపూర్ను చూస్తారు.
- ఈ పాత్ర కోసం మానసికంగా, శారీరకంగా ఎన్నో కసరత్తులు చేశాను. ఇప్పటివరకు నేను నటించిన పాత్రలన్నింటి కన్నా.. ఇందులో మహిమ పాత్రలో రెండింతల ఉత్సాహాన్ని, అనుభూతిని పొందాను. ఇంతకముందెప్పుడూ ఏ పాత్రలోనూ ఇలా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ నటించలేదు’’.
- ‘‘ఎంచుకునే ప్రతి పాత్రలోనూ కొత్తదనం ఉండేలా చూసుకుంటాను. ఇప్పటి వరకు రెండు సినిమాల్లో పెళ్లయిన అమ్మాయిగా నటించాను. ఇలాంటి పాత్రల్లో నటించడం వల్ల వివాహ పద్ధతుల గురించి సులభంగా తెలుసుకోగలుగుతున్నాను. ఈ పాత్రల నేపథ్యం ఏంటి? వైవాహిక అనుబంధాలు ఎలా ఉంటాయి? ఇలాంటివన్నీ నేను పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలు’’.
- ‘‘ఈ చిత్రం కోసం క్రికెట్ శిక్షణ తీసుకున్నా. నా కోచ్లు నన్ను క్రికెట్ అభిమానిగా మార్చేశారు. ఇందులో క్రికెట్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఎన్నోసార్లు గాయాలయ్యాయి. తట్టుకోలేక కొన్నిసార్లు ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకున్నా. కానీ తర్వాత మనసు మార్చుకొని, ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రతి సీన్ సహజంగా రావడానికి ఎంతో కష్టపడ్డాను’’.
- ‘‘రాజ్కుమార్ రావ్తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. సినిమా గురించి, ఆ ప్రాజెక్టులో భాగమైన నటులు, సాంకేతిక నిపుణులు, సినిమా నిర్మాణం.. ఇలా ప్రతి అంశం పట్ల చాలా మక్కువ కలిగి ఉంటారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మానసికంగా ధైర్యాన్ని చెప్తూ సహకరించారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టులో కురిసేనా...! వినోదాల వాన
బయట వాన జల్లు... థియేటర్లో వినోదాల జల్లు. ప్రేక్షకుడు తడిసి ముద్దయిపోవడమే ఇక! ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలొస్తున్నాయి. -
‘ఉప్పు కప్పురంబు’ షూటింగ్ డైరీస్
ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో ‘రఘుతాత’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘మహానటి’ కీర్తి సురేశ్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. -
స్టోరీకి శుభం కార్డు పడిందా?
‘‘ఎంతో ప్రేమతో చేసిన సినిమా ఇది. నాలుగు కాలాలపాటు గుర్తుండిపోతుంది’’ అన్నారు అనురాగ్ పి. ఆయన దర్శకత్వంలో... నరేశ్ వీకే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహారయాత్ర’. -
విజయ్ చిత్రం కోసం శ్రుతి గానం!
ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయికల్లో శ్రుతిహాసన్ ఒకరు. ఇప్పుడామె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. -
ఇండోనేషియాలో శర్వా బైక్ రేసింగ్!
ఇటీవలే ‘మనమే’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడాయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. -
జాతర వస్తుందంటేనే భయం వేస్తోంది!
సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రల్లో యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. -
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
టాలీవుడ్ సీనియర్ నటి పావలా శ్యామలకు నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్థికసాయం చేశారు. -
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
‘మిస్టర్ బచ్చన్’ సినిమా పంపిణీ వివరాలపై ఓ సినీ జర్నలిస్ట్ పెట్టిన పోస్ట్పై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. -
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ఫేక్ ఈ-మెయిల్ ఐడీ సృష్టించి అసత్య ప్రచారం చేస్తున్న ఘటనను ఆ చిత్ర నిర్మాణ సంస్థ ఖండించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్