Jayeshbhai Jordaar: సర్పంచ్ కొడుకుగా రణ్వీర్ .. ‘జయేష్భాయ్ జోర్దార్’ ట్రైలర్ చూశారా!
రణ్వీర్ సింగ్ హీరోగా దివ్యాంగ్ టక్కర్ తెరకెక్కించిన చిత్రం ‘జయేష్ జోర్దార్’. షాలినీ పాండే కథానాయిక. ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఇంటర్నెట్ డెస్క్: రణ్వీర్సింగ్ హీరోగా దివ్యాంగ్ థక్కర్ తెరకెక్కించిన చిత్రం ‘జయేష్భాయ్ జోర్దార్’. షాలినీ పాండే కథానాయిక. ఈ సినిమా మే 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మంగళవారం ట్రైలర్ను విడుదల చేసింది. మద్యం సేవించి కొందరు బాలురు ఇబ్బంది పెడుతున్నారని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఓ బాలిక సర్పంచ్కు విన్నవించే సీన్తో ప్రారంభమైన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. సర్పంచ్గా బొమన్ ఇరానీ, ఆయన కొడుకు జోర్దార్గా రణ్వీర్, కోడలిగా షాలినీ కనిపించారు. ఊరందరికీ తీర్పునిచ్చే ఆ సర్పంచ్.. తన కొడుక్కి రెండోసారి ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే ఏం చేశాడు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్టు, నవ్వులు పంచుతూనే సందేశం ఇవ్వబోతున్నట్టు ట్రైలర్లోని సన్నివేశాలు తెలియజేస్తున్నాయి. మనీషా శర్మ నిర్మించిన ఈ చిత్రానికి విశాల్- శేఖర్ సంగీతం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!