Kriti Sanon: కొత్త ప్రయాణంలో సీతాకోక చిలుకల నాట్యం

ప్రముఖ హిందీ కథానాయిక కృతి సనన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్దం గడిచింది. నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.

Updated : 24 Aug 2023 14:00 IST

ప్రముఖ హిందీ కథానాయిక కృతి సనన్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్దం గడిచింది. నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె తొలిసారి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె కీలక పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘దో పత్తి’. మిస్టరీ థ్రిల్లర్‌ కథతో రానున్న ఈ చిత్రంలో కాజోల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘దిల్‌వాలే’ వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత కృతి..కాజోల్‌ కలిసి నటిస్తున్న సినిమా ఇది. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్‌’ పతాకంపైనే ‘దో పత్తి’ని నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినట్లు కృతి సనన్‌ ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ‘‘ఈ ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎన్నో సీతాకోకచిలుకలు నాలో నాట్యం చేస్తున్నాయి. ఇది నాకు సవాలుతో కూడిన పాత్ర. ఈ సినిమా కథ నాకు చాలా నచ్చింది. ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్‌’కు ఇది మొదటి సినిమా’ అంటూ తాను పోస్ట్‌ చేసిన ఫొటోకు వ్యాఖ్యల్ని జోడించింది కృతి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని