Kriti Sanon: ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. చట్టపరమైన చర్యలు తీసుకున్న కృతి సనన్‌

తాను ట్రేడింగ్ మాధ్యమాల గురించి మాట్లాడలేదని నటి కృతి సనన్‌ (Kriti Sanon) స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలపై జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

Updated : 04 Dec 2023 13:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి కృతి సనన్‌ (Kriti Sanon) ట్రేడింగ్‌ మాధ్యమాలను సపోర్ట్‌ చేస్తున్నారంటూ ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. వీటిపై ఆమె స్పందించారు. తాను అలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఓ బాలీవుడ్‌ టాక్‌షోలో ఆమె ట్రేడింగ్‌ మాధ్యమాలను  ప్రోత్సహించారని ఇటీవల పలు కథనాలు వచ్చాయి. తాజాగా దీనిపై కృతి ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

‘కొన్ని వార్తాపత్రికలు నేను మాట్లాడని వాటిని ప్రచారం చేశాయి. ఆ కథనాలు పూర్తిగా అవాస్తవం. ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో నాకు అనుబంధం ఉన్నట్లు రాశారు. నేను ఈ అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదు. ఇలాంటి తప్పుడు కథనాలు, నివేదికలపై నేను చట్టపరమైన చర్యలు తీసుకున్నాను. లీగల్ నోటీసులు జారీ చేశాను. ఇలాంటి తప్పుడు రిపోర్టుల పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు.

కన్నీళ్లు పెట్టుకున్న బాబీ దేవోల్‌.. వీడియో వైరల్‌

ఇక సినిమాల విషయానికొస్తే.. ఉత్తమ నటిగా ఈ ఏడాది జాతీయ అవార్డును అందుకున్న కృతి ఇటీవల ‘గణపథ్‌: ఎ హీరో ఈజ్‌ బోర్న్‌’తో ప్రేక్షకులను పలకరించింది. టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించిన ఆ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ప్రస్తుతం కృతి బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే  ‘దో పత్తి’ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు