Mahesh Babu: మహేశ్‌బాబు చిత్రం సరికొత్త రికార్డ్‌.. అభిమానుల ఆనందం

మహేశ్‌బాబు (MaheshBabu) నటించిన ఓ చిత్రం సరికొత్త రికార్డు అందుకుంది. దీనిపై ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Published : 08 Sep 2023 15:18 IST

హైదరాబాద్‌: నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) నటించిన ఓ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ ఏ తెలుగు చిత్రం ఆ రికార్డును అందుకోకపోవడం విశేషం. ఇంతకీ ఆ రికార్డు ఏమిటి? దానిని అందుకున్న చిత్రమేమిటంటే..?

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘శ్రీమంతుడు’ (Srimanthudu). కొరటాల శివ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. శ్రుతిహాసన్‌ కథానాయిక. సొంత ఊరును దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2015లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. వసూళ్ల పరంగా అప్పట్లో ఇది నాన్‌ బాహుబలి రికార్డులను అందుకుంది. కాగా, తాజాగా ఈ సినిమా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ అందుకున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.

Jawan: జవాన్‌ కోసం గూగుల్‌ యానిమేషన్‌ ‘రెడీ’..!

చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ 2017లో ‘శ్రీమంతుడు’ పూర్తి చిత్రాన్ని యూట్యూబ్‌ వేదికగా సినీ ప్రియులకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని దాదాపు 200,041,750 మంది వీక్షించారు. 834K మంది దీనిని లైక్‌ చేశారు. ఈ ఘనత దక్కడంపై మహేశ్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని