Manchu Manoj: అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
‘మిరాయ్’తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనున్నారు మంచు మనోజ్. ఈ సినిమాలోని ఆయన లుక్ విడుదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: సినీ కెరీర్ పరంగా ఒకానొక సమయంలో నిరాశ చెందానని, తర్వాత ఓపిక విలువేంటో అర్థమైందని మంచు మనోజ్ (Manchu Manoj) అన్నారు. ‘మిరాయ్’ (Mirai) ఈవెంట్లో ఆయన మాట్లాడారు. కొన్నాళ్ల బ్రేక్ అనంతరం ఆయన నటిస్తున్న సినిమాల్లో ఇదొకటి. తేజ సజ్జా (Teja Sajja) హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని టీమ్ ఫస్ట్లుక్ గ్లింప్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించింది.
అభిమానులు, ప్రేక్షకులనుద్దేశించి మనోజ్ మాట్లాడుతూ.. ‘‘నేను వెండితెరపై కనిపించి ఎనిమిదేళ్లయింది. అప్పుడప్పుడు సోషల్మీడియా, సినీ వేడుకలు.. ఇలా ఏదో ఓవిధంగా మీకు దగ్గరగా ఉంటున్నా. కానీ, సినిమాలతోనే మిమ్మల్ని అలరించడం నాకు ఆనందం. మీకు విభిన్న కథలను పరిచయం చేయాలనేదే నా కోరిక. ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తా. డబ్బు కోసం కాకుండా మనసుకు నచ్చిన స్టోరీలను ఎంపిక చేసుకుంటూ వచ్చా. కొంత విరామం అనంతరం మళ్లీ నటించాలనుకుని.. ఎన్నో కథలు విన్నా. వాటిలో కొన్ని నచ్చలేదు. నచ్చినవి అనివార్య కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ఈ క్రమంలో నిరాశ చెందా. ఓపిక విలువేంటో అర్థమైంది. ‘మనం కలిసి నటిద్దాం.. అన్నా’ అంటూ తేజ నన్ను అడిగాడు. ఆమేరకు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని నన్ను సంప్రదించి, ‘మిరాయ్’ స్క్రిప్టు చెప్పారు. వినగానే నన్ను ఆకట్టుకుందా కథ. రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. పార్ట్ 1.. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదలవుతుంది’’ అని తెలిపారు.
అదే వేదికపై తన స్నేహితుడు, హీరో ఎన్టీఆర్ (NTR)కు బర్త్డే విషెస్ చెప్పారు. గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేస్తున్న ‘కన్నప్ప’ (Kannappa) టీమ్కి కృతజ్ఞతలు తెలిపారు. తన సోదరుడు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. ‘మిరాయ్’లో కీ రోల్ ప్లే చేస్తున్న మనోజ్.. హీరోగా ‘వాట్ ది ఫిష్’లో నటిస్తున్నారు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఓ సినిమా ఖరారు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిహారిక ధైర్యాన్ని మెచ్చుకోవాలి : సిద్ధూ జొన్నలగడ్డ
‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ పాల్గొన్నారు. -
‘దేవర’ సాంగ్ అప్డేట్ ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ఏమన్నారంటే?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా సాంగ్ అప్డేట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్. -
నిజమైన సింహంతో ఫస్ట్ ఆసియా ఫిల్మ్.. ‘మాంబో’!
‘అరణ్య’తో అలరించిన దర్శకుడు ప్రభు సాల్మన్ మరో సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. -
తనే నిజం చెబితే బాగుంటుంది: రాజ్ తరుణ్ ఇష్యూపై డైరెక్టర్ రవికుమార్
రాజ్ తరుణ్ ఇష్యూపై దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ స్పందించారు. రాజ్ తరుణ్ హీరోగా రవికుమార్ తెరకెక్కించిన చిత్రం ‘తిరగబడర సామీ’ త్వరలోనే విడుదల కానుంది. -
అందుకే రాజ్ తరుణ్ను హీరోగా తీసుకున్నా: ‘పురుషోత్తముడు’ డైరెక్టర్
రాజ్ తరుణ్ హీరోగా రామ్ భీమన తెరకెక్కించిన చిత్రం ‘పురుషోత్తముడు’. ప్రచారంలో భాగంగా దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
రాజ్తరుణ్ వల్ల ‘పురుషోత్తముడు’ బిజినెస్ లాస్ అయిందా?.. నిర్మాత ఏమన్నారంటే!
‘పురుషోత్తముడు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. రాజ్తరుణ్ వల్ల సినిమా బిజినెస్ లాస్ అయిందా?అనే ప్రశ్నకు నిర్మాత రమేశ్ సమాధానమిచ్చారు. -
‘రాజాసాబ్’పై తమన్ ఆసక్తికర కామెంట్స్.. ఏం అప్డేట్ ఇచ్చారంటే?
ప్రభాస్ ‘రాజాసాబ్’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాల అప్డేట్స్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్. -
లీక్స్పై స్పందించిన ‘వీడీ 12’ టీమ్.. సోషల్ మీడియాలో పోస్ట్
లీక్స్ రావడంపై ‘వీడీ 12’ టీమ్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. -
అది చిన్న విషయం కాదు: ‘డబుల్ ఇస్మార్ట్’ సాంగ్పై పూరి జగన్నాథ్
తన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’లోని ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. -
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా?: ప్రశ్నించిన అనిల్ రావిపూడి
హీరోయిన్ల గురించి మాట్లాడకూడదా? అని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రశ్నించారు. ఏం జరిగిందంటే? -
ఎన్టీఆర్పై ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రశంసలు: ‘దేవర’ సాంగ్ గురించి ఏమన్నారంటే?
టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్పై కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. -
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబో.. సర్ప్రైజ్ అదిరింది
సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘సూర్య 44’ (వర్కింగ్ టైటిల్). సూర్య పుట్టినరోజు సందర్భంగా టీమ్ సర్ప్రైజ్ ఇచ్చింది. -
వీటి ఆధారంగా ‘కల్కి’ రెండు భాగాలు: ఫొటో పంచుకున్న నాగ్ అశ్విన్
‘కల్కి 2898 ఏడీ’ సినిమాకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. -
ఆర్ఆర్ఆర్ను బీట్ చేసిన కల్కి 2898 ఏడీ.. వసూళ్లు ఎంతంటే?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్లను అధిగమించింది. -
రెండు సినిమాల అప్డేట్స్ చెప్పిన రజనీకాంత్.. ‘ఇండియన్ 2’ గురించి ఏమన్నారంటే!
తన అప్కమింగ్ సినిమాల అప్డేట్లను రజనీకాంత్ పంచుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. -
ఈ వారం థియేటర్లో వినోదాల విందు.. మరి ఓటీటీలో..!
‘కల్కి’ తర్వాత వచ్చిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. జులై చివరిలో మరికొన్ని చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి థియేటర్తో పాటు ఓటీటీలో వస్తున్న ఆ చిత్రాలేంటో చూసేయండి. -
రీమేక్ అంటూ నెటిజన్ కామెంట్: స్పందించిన హరీశ్ శంకర్
తన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’పై ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. హరీశ్ శంకర్ స్పందించారు. -
‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అప్పుడే.. దిల్ రాజు ప్రకటన
‘గేమ్ ఛేంజర్’ విడుదలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఏమన్నారంటే? -
ధనుష్ ఇచ్చిన ఛాన్స్.. అదే నాకు అవార్డు: సందీప్ కిషన్ ఎమోషనల్ స్పీచ్
‘రాయన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ఎమోషనల్గా మాట్లాడారు. ధనుష్పై ప్రశంసలు కురిపించారు. -
‘మిస్టర్ బచ్చన్’ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇప్పటికే పలు చిత్రాలు సిద్ధమవగా సడెన్గా ‘మిస్టర్ బచ్చన్’ విడుదల తేదీ ఖరారైంది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కూడా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
‘పుష్ప 2’ రూమర్స్పై స్పందించిన బన్నీ వాసు.. అందుకే గడ్డం తీసేశారు!
‘పుష్ప 2’ రూమార్స్ గురించి నిర్మాత బన్నీ వాసు ఏమన్నారంటే?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!