malaikottai valiban: నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు సెట్స్‌పైకి!

‘మలైకోటై వాలిబన్‌’గా ఇటీవలే తెరపై కనిపించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ అగ్రకథాయకుడు మోహన్‌లాల్‌. ప్రయోగాత్మక కథలు, సవాలు విసిరే పాత్రలతో ప్రయాణం చేస్తున్న ఆయన.

Updated : 16 May 2024 09:38 IST

లైకోటై వాలిబన్‌’గా ఇటీవలే తెరపై కనిపించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ అగ్రకథాయకుడు మోహన్‌లాల్‌. ప్రయోగాత్మక కథలు, సవాలు విసిరే పాత్రలతో ప్రయాణం చేస్తున్న ఆయన.. ‘రామ్‌’తో తనలోని మరో కోణాన్ని చూపించడానికి సిద్ధమవుతున్నారు. జీతూ జోసెఫ్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ‘నెరు’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న రెండో చిత్రమిది. త్రిష కథానాయిక. ఈ ప్రాజెక్టు ప్రకటించి నాలుగేళ్లు అయినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల షూటింగ్‌ను ౖకొనసాగించలేదు. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణను ఆగస్టులో మళ్లీ మొదలు పెట్టడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో టైటిల్‌ పాత్రలో రా ఏజెంట్‌గా కనిపించనున్నారు మోహన్‌లాల్‌. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రమేశ్‌, సుధన్‌ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘కన్నప్ప’, ‘బరోజ్‌’ తదితర చిత్రాలతో బిజీగా ఉన్నారు మోహన్‌లాల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని