Mrunal Thakur: తిరస్కరించిన వారికి కృతజ్ఞతలు చెప్పాలి.. ఎందుకంటే: మృణాల్‌ ఠాకూర్‌

వచ్చిన పాత్రకు శతశాతం న్యాయం చేయాలని మృణాల్‌ ఠాకూర్‌ అన్నారు. ‘సీతారామం’ను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్లు తెలిపారు.

Published : 12 Apr 2024 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో బిజీగా మారారు నటి మృణాల్‌ ఠాకూర్‌. ఇటీవలే ‘ఫ్యామిలీ స్టార్‌’తో పలకరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. అలాగే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ‘సీతారామం’ మనసుకు నచ్చిందని చెప్పారు.

‘నటీనటులు పాత్రల్లో లీనమైతేనే అవి ప్రేక్షకుల మనసును హత్తుకుంటాయి. మనం జీవించినట్లు ఉండాలి. ‘సీతారామం’ను ప్రాణం పెట్టి చేశాను. అందుకే దానినుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నా. మర్చిపోవడం కష్టంగా ఉంది. నేను అంత ఇష్టంగా చేశాను కాబట్టే ప్రేక్షకులు నన్ను సీతామహాలక్ష్మిగా ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో నన్ను తిరస్కరించిన వారికి కృతజ్ఞతలు చెప్పాలి. నటనకు పనికిరానని చెప్పారు కాబట్టే నాలో పట్టుదల పెరిగింది. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నా. నటీనటుల మధ్య పోటీ ఎప్పుడూ ఉండాలి. ఒకరికి పోటీగా ఉండడంలో తప్పేం లేదు’ అని చెప్పారు.

తాజాగా ‘ఫ్యామిలీ స్టార్‌’లోని ఫొటోలను పంచుకున్న మృణాల్‌.. ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశానన్నారు. ‘తెరపై నేను చేసే ప్రతీ పాత్ర నా మనసులో ఎప్పటికీ గుర్తుంటుంది. ఇందులా మారడం కోసం చాలా కష్టపడ్డాను. క్యారెక్టర్‌ను అర్థం చేసుకోవడం మొదట సవాలుగా అనిపించింది. తర్వాత చాలా సులభమైంది’ అన్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాను పరశురామ్‌ తెరకెక్కించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని