Naga Chaitanya: ఆ తర్వాత పట్టించుకోను: పర్సనల్‌ లైఫ్‌పై నాగచైతన్య కామెంట్స్‌

పనిపైనే తాను దృష్టి పెట్టినట్లు హీరో నాగచైతన్య తెలిపారు. ఇకపై తన సినిమాలే మాట్లాడతాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Published : 02 Dec 2023 02:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొంతకాలంగా నాగ చైతన్య (Naga Chaitanya) ఏ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నా వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రతిసారి ఆయన స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి రియల్‌ లైఫ్‌ గురించి హోస్ట్‌ ప్రశ్నలు అడగ్గా నాగచైతన్య సమాధానమిచ్చారు. ‘దూత’ (Dhootha) వెబ్‌సిరీస్‌ ప్రచారంలో భాగంగా ఓ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం వచ్చిన రూమర్స్‌పై ఆయన స్పందిస్తూ.. ‘‘ఓ పాయింట్‌ తర్వాత నేను దేని గురించి పెద్దగా పట్టించుకోను. నాతో సన్నిహితంగా ఉండే వారికి నిజమేంటో తెలుసు. వ్యక్తిగతంగా కంటే నేను చేసే పనిద్వారా అందరికీ తెలియాలనుకుంటా. అందుకే నేను పనిపైనే దృష్టిపెట్టా. నేను నటించే సినిమాలే మాట్లాడతాయి. నా సినిమాలు ప్రేక్షకులను అలరించి, వాటి ద్వారా వారు నన్ను గుర్తుపెట్టుకుంటే చాలు’’ అని తెలిపారు.

నాగచైతన్య ఫస్ట్‌ వెబ్‌సిరీస్‌ ‘దూత’.. ఎలా ఉంది?

నాగచైతన్య నటించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘దూత’. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ శుక్రవారం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో విడుదలైంది. ఈ సిరీస్‌లో నాగచైతన్య జర్నలిస్ట్‌ సాగర్‌ వర్మ అవధూరిగా కనిపిస్తారు. ఇప్పటికే ఈ సిరీస్‌ మంచి టాక్‌ సొంతం చేసుకుంది. మరోవైపు, ‘తండేల్‌’ చిత్రంతో బిజీగా ఉన్నారు చైతన్య. చందూ మొండేటి తెరకెక్కించనున్న ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో పలు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని