Naga Vamsi: నాగవంశీ ‘క్లారిటీ’ పోస్ట్‌.. ఆ సినిమా గురించేనా..?

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత నాగవంశీ తాజాగా పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది..

Updated : 17 Apr 2024 12:53 IST

హైదరాబాద్‌: తమ బ్యానర్‌కు సంబంధించి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాత నాగవంశీ (Naga Vamsi) స్పష్టతనిచ్చారు. ‘‘సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న అప్‌డేట్స్‌, ఫొటోల్లో ఎలాంటి వాస్తవం లేదు. మేం నిర్మించే, డిస్ట్రిబ్యూట్‌ చేసే చిత్రాలకు సంబంధించిన విషయాలను అధికారికంగా ప్రకటిస్తాం. కాబట్టి, దయచేసి వదంతులు నమ్మకండి’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. నాగవంశీ ఈ పోస్ట్‌ పెట్టానికి కారణం ఏమిటా? అని పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం ‘దేవర’ గురించే అని అనుకొంటున్నారు. 

‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవర’ (Devara). జాన్వీకపూర్‌ కథానాయిక. పవర్‌ఫుల్ యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అక్టోబర్‌ 10న ఇది విడుదల కానుంది. ఎనిమిదేళ్ల తర్వాత హిట్‌ కాంబో రిపీట్‌ కావడం.. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలోనే సినిమా థియేట్రికల్‌ హక్కులు సొంతం చేసుకునేందుకు టాలీవుడ్‌కు చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయని టాక్‌. ఈ క్రమంలోనే భారీ మొత్తం చెల్లించి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ రైట్స్‌ కొనుగోలు చేసిందని గత కొన్నిరోజుల నుంచి ప్రచారం సాగుతోంది. నాగవంశీ తాజాగా పెట్టిన పోస్ట్‌తో ఆయా ప్రచారాలకు చెక్‌ పడినట్లు అయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని