Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రిలీజ్‌.. అదే మాటపై నాగవంశీ

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రాన్ని ఉద్దేశించి నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 31 Dec 2023 15:35 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram) హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్‌ను ఉద్దేశించి తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్‌ను ఆయన షేర్‌ చేశారు. ‘‘ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తాం. కంటెంట్‌ విషయంలో నేను నమ్మకంగా ఉన్నా’’ అని ఆయన చెప్పారు.

తాజాగా ఈ వీడియో క్లిప్‌ను షేర్‌ చేసిన ఆయన.. ‘‘మీకు మళ్లీ చెబుతున్నా. మేము అదే మాట మీద ఉన్నాం.‘గుంటూరు కారం’ను భారీగా విడుదల చేస్తాం. రిలీజ్‌ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్‌ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Hanuman: ‘హనుమాన్‌’.. రిలీజ్‌ డేట్‌ వాయిదా వేయకపోవడానికి కారణమదే: ప్రశాంత్‌ వర్మ

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతి బాబు, జయరాం, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్‌ చేయాలని కోరుతూ పలువురు అభిమానులు వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు. దీంతో #WeDemandRecordReleaseForGK అనే హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలోనే నాగవంశీ తాజాగా ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని