Nayanthara: రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నయనతార.. ఫొటో షేర్‌ చేసిన విఘ్నేశ్‌

నయనతార తన భర్తను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Published : 03 Mar 2024 12:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanthara) పేరు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవల ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను అన్‌ఫాలో చేయడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. దీంతో నెట్టింట రకరకాల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వాటన్నింటికీ ఆమె చెక్‌ పెట్టారు.

ప్రేమికుల రోజు నయనతార తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్‌ చెప్పి పోస్ట్ పెట్టారు. కానీ, తాజాగా అతడిని అన్‌ఫాలో చేయడంతో ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. ‘సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగిందా’ అని పోస్ట్‌లు పెట్టారు. అయితే, కొన్ని మీడియా సంస్థలు వీళ్లిద్దరూ విడిపోనున్నారంటూ ప్రచారం చేశాయి. వాటికి చెక్‌ పెడుతూ నయనతార తిరిగి విఘ్నేశ్‌ను ఫాలో అవుతున్నారు. అలాగే, విఘ్నేశ్‌ (Vignesh Shivan) ఆమె ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు. దీంతో ఈ వ్యవహారానికి ముగింపు పడింది.

అంబానీ ఈవెంట్‌లో ‘నాటునాటు’ పాట.. స్టెప్పేసిన బాలీవుడ్‌ త్రయం

గతేడాది ‘జవాన్‌’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు నయనతార. అట్లీ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించి కలెక్షన్ల సునామీ సృష్టించింది. రూ.1000కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌. శశికాంత్‌ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని