Nayanthara: నయనతారకు ‘డియర్‌ స్టూడెంట్స్‌’ స్వాగతం

గతేడాది ‘జవాన్‌’తో భారీ విజయాన్ని అందుకున్న నయనతార మళ్లీ ఎలాంటి కథతో తెరపై సందడి చేయనుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

Updated : 15 Apr 2024 12:06 IST

తేడాది ‘జవాన్‌’తో భారీ విజయాన్ని అందుకున్న నయనతార మళ్లీ ఎలాంటి కథతో తెరపై సందడి చేయనుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పుడామె వాళ్లు మెచ్చేలా ఓ కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. మలయాళ కథానాయకుడు నివిన్‌ పౌలీ నటిస్తున్న చిత్రం ‘డియర్‌ స్టూడెంట్స్‌’లో కథానాయికగా నయనతార ఎంపికైనట్లు ఆదివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ‘‘డియర్‌ స్టూడెంట్స్‌’ అందమైన, వినోదంతో కూడిన ప్రపంచంలోకి తన నటనతో ప్రేక్షకులను మురిపించే అద్భుతమైన నాయిక నయనతారకు స్వాగతం’’ అని వ్యాఖ్యల్ని జోడించింది. సందీప్‌ కుమార్‌, జార్జ్‌ ఫిలిప్‌రాయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు నివిన్‌, నయన కలయికలో వచ్చిన ‘లవ్‌ యాక్షన్‌ డ్రామా’ మంచి విజయాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని