Nayanthara: విఘ్నేశ్‌ శివన్‌ను అన్‌ఫాలో చేసిన నయనతార..

నటి నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశారు.

Published : 03 Mar 2024 02:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరోయిన్‌ నయనతార (Nayanthara) ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. వారి పిల్లలను చూపిస్తూ తొలిపోస్ట్‌ పెట్టగా దానికి లక్షల మంది లైక్‌లు, కామెంట్లు పెట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాలో 78లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే, తాజాగా నయనతార తన భర్త విఘ్నేశ్‌ శివన్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘పొరపాటున ఇలా చేశారు’ అని ఒకరు పోస్ట్ పెట్టగా.. ‘సాంకేతికలోపం వల్ల విఘ్నేశ్‌ పేరు కనిపించడం లేదంతే’ అని మరొకరు అన్నారు. సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ (Vignesh Shivan) పెద్దల అంగీకారంతో 2022 జూన్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

మహేశ్‌ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!

సినిమాల విషయానికొస్తే.. గతేడాది ‘జవాన్‌’తో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార.. ప్రస్తుతం ‘టెస్ట్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌. శశికాంత్‌ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఇందులో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘కుముద...నా జీవితంలోకి ఓ పాత్రలా వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ పాత్రను ఇంత అందంగా తీర్చిదిద్దిన దర్శకుడు శశి, కుముదకు అండగా నిలిచిన మాధవన్‌, స్ఫూర్తినిచ్చిన సిద్ధార్థ్‌... అందరికీ చాలా థాంక్యూ. ‘టెస్ట్‌’ ద్వారా మా ప్రేమను చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’ అని పేర్కొన్నారు. దీనితో పాటు మరో తమిళ సినిమాలోనూ నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని