Parineeti Chopra: ట్రాఫిక్లో చిక్కుకొని పాట పాడాను
‘నేను ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు ‘అమర్ సింగ్ చమ్కీలా’ చిత్రం కోసం సింగింగ్ ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చింది’ అని అంటోంది పరిణీతి చోప్రా.
‘నేను ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు ‘అమర్ సింగ్ చమ్కీలా’ చిత్రం కోసం సింగింగ్ ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చింది’ అని అంటోంది పరిణీతి చోప్రా. ఈమె..దిల్జీత్ దోసాంజ్ జంటగా నటించిన చిత్రమిది. తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న పరిణీతి తనకి ఈ సినిమాలో పాటలు పాడే అవకాశం ఎలా వచ్చిందో తెలిపింది. ‘రెండేళ్ల క్రితం నేను కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకకు వెళ్తున్న సమయంలో దర్శకుడు ఇంతియాజ్ అలీ నుంచి ఫోన్ వచ్చింది. ‘దిల్జీజ్, రెహమాన్ కూడా జూమ్ కాల్లో ఉన్నారు. మీతో ఇప్పుడు మాట్లాడవచ్చా?’ అని అడిగారు. ట్రాఫిక్లో చిక్కుకున్న నేను కారులో ఉన్నవాళ్లని నిశ్శబ్దంగా ఉండమన్నాను. ఊపిరి కూడా పీల్చుకోలేనంత నిశ్శబ్దం చుట్టుముట్టింది. పాటలు పాడటం తెలుసా? అని రెహమాన్ సర్ అడిగితే..పాడటం అంటే ఇష్టమని చెప్పా. ఆ జూమ్ కాల్లో ‘దమా దమ్ మస్త్ కలందర్’ అనే పాటని పాడమన్నారాయన. వారికి నచ్చింది. అందులో నటనతోనే కాదు.. పాటలు పాడటంలో కూడా భాగమవుతున్నానని అప్పుడే అర్థమైంది’ అంటూ గుర్తుచేసుకుంది పరిణీతి. ‘ప్రకాశవంతంగా మెరిసే రంగీలా..అతడే మన అమర్ సింగ్ చమ్కీలా..’ అంటూ ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ని విడుదల చేశారు. ‘ప్రజలు ఎలాంటి పాటలు వినాలనుకుంటున్నారో నాకు తెలుసు. వారికి ఆ ఆనందాన్ని నేనివ్వగలను. మేము గాయకులం. పాడటమే మా పని’ లాంటి సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఏప్రిల్ 12న ఓటీటీలో విడుదల కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినోదభరితమైన ‘సంగీత్’
నిఖిల్ విజయేంద్ర సింహా, తేజు అశ్విని జంటగా సాద్ ఖాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సంగీత్’. నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
పతాక పోరాటంలో నాని
వారంలో ఒక్క రోజు మాత్రమే తనలోని కోపాన్ని చూపించే సూర్య అనే యువకుడిగా తెరపై సందడి చేయనున్నాడు... నాని. కోపానికి ఆ ఒక్క రోజే ఎందుకో తెలియాలంటే మాత్రం ‘సరిపోదా శనివారం’ చూడాల్సిందే. -
ప్రతిఒక్కరూ తమకు అన్వయించుకోగలిగే కథ ఇది
‘రాజు యాదవ్’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రంతో కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. -
హడలెత్తిస్తాం.. నవ్వించేస్తాం
ప్రేమకథలు.. కామెడీ ఎంటర్టైనర్లు.. ఇలా భిన్నమైన జానర్లలో చిత్రాలు వచ్చినప్పటికీ హారర్ చిత్రాలంటే ఇంకాస్త ఆసక్తి ఎక్కువే ఉంటుంది సినీప్రియులకి. మరి ఈ హారర్ చిత్రాలకి కామెడీ తోడైతే ప్రేక్షకులకు పండగే కదా. భయపెడుతూ.. అంతలోనే నవ్వులు పూయించే హాస్యంతో ముందుకు సాగుతుంటాయి ఈ సినిమాలు. ప్రస్తుతం బాలీవుడ్లో కొన్ని హారర్ చిత్రాలు కామెడీ అంశాల మేళవింపుగా రూపొందుతున్నాయి. -
జోడీ కుదిరినట్టేనా?
అద్భుతమైన నటన.. ఆకర్షించే అందంతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది అందాల తార నయనతార. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. -
హైదరాబాద్లో రామ్చరణ్ ఆట
చాలా రోజులుగా సెట్స్పై ఉన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సినీ ప్రేమికులు... అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడం.... అందులోనూ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అంటే... అందులో భారీ హంగులు ఖాయం. వాటిని పక్కాగా తెరపైకి తీసుకు రావడంలో ఏమాత్రం రాజీపడరు శంకర్. -
ఆ మ్యాజిక్ కొన్నిసార్లే..!
సవాళ్లతో కూడిన పాత్రల్ని భుజాన మోసే కొద్దిమంది కథానాయికల్లో కీర్తిసురేశ్ ఒకరు. ‘మహానటి’కి ముందు... తర్వాత అన్నట్టుగా మారింది ఆమె కెరీర్. అప్పట్నుంచి మరింత బాధ్యతగా పాత్రల్ని ఎంపిక చేసుకుంటూ ప్రయాణం చేస్తోంది కీర్తి. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!