Akira Nandan: అకీరాను ప్రధాని మోదీకి పరిచయం చేసిన పవన్‌.. ఫొటో వైరల్‌

Akira Nandan: ఎన్డీయే కూటమి నేతల సమావేశం అనంతరం పవన్‌కల్యాణ్‌ తన కుటుంబాన్ని ప్రధాని మోదీకి పరిచయం చేశారు.

Updated : 06 Jun 2024 19:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్  (Pawan Kalyan) ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి తన కుటుంబంతో సహా హాజరయ్యారు. సతీమణి అన్నాలెజినోవా కొణిదెలతో పాటు తన కుమారుడు అకీరా నందన్‌ను (Akira Nandan) సైతం దిల్లీకి తీసుకెళ్లారు. కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈసందర్భంగా అకీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది.

ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం పవన్‌కల్యాణ్‌కు ఆయన సతీమణి హారతి ఇస్తున్న వీడియోలోనూ వెనక అకీరానే కనిపించాడు. పవన్‌ వద్దకు తెదేపా అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు అకీరాను పరిచయం చేయడమే కాకుండా, ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమని సూచించారు. ఫలితాల రోజున ఆ ఫొటోలు వైరల్‌ అయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని