Pawan Kalyan: ‘గాజు గ్లాసు’లోనే టీ తాగుతా: పవన్‌ కల్యాణ్‌ మాతృమూర్తి సంతోషం

తన కుమారుడు పవన్‌ కల్యాణ్‌ విజయం సాధించడంపై అంజనా దేవి ఆనందం వ్యక్తం చేశారు. ‘గాజు గ్లాసులోనే టీ తాగుతా అని తెలిపారు.

Published : 05 Jun 2024 00:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలాసవంతమైన జీవితం గడపాల్సిన తనయుడు.. ప్రజాసేవకు కదిలి ఎందరితోనో మాటలు పడితే ఏ తల్లికైనా బాధ కలుగుతుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా కొడుకు అనుకున్నది సాధిస్తే ఆమె ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ప్రస్తుతం ఈ అనుభూతినే పొందుతున్నారు నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మాతృమూర్తి అంజనా దేవి (Anjana Devi). ఆమె తన సంతోషాన్ని ఓ వీడియో ద్వారా వ్యక్తం చేశారు. ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడడం అందరినీ ఆకర్షిస్తోంది. ‘‘మా అబ్బాయి రాజకీయాల్లో విజయం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు తగ్గ ఫలితం ఇచ్చాడు. ఈ రోజు నుంచి గాజు గ్లాసులోనే టీ తాగుతా’’ అంటూ టీని ఆస్వాదిస్తూ కనిపించారామె.

గర్వపడే రోజు ఇది: రామ్‌ చరణ్‌

హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan) సోషల్‌ మీడియా వేదికగా తన బాబాయ్‌ పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మన కుటుంబం గర్వపడే రోజు ఇది’ అంటూ జనసేనానిని ప్రశంసించారు.

నా హృదయం ఉప్పొంగుతోంది: పవన్‌ విజయంపై చిరంజీవి ఆనందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని