Prabhas: ‘యానిమల్‌’ ట్రైలర్‌పై ప్రభాస్‌ రివ్యూ.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌

రణ్‌బీర్ కపూర్‌-రష్మిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌ను ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

Published : 24 Nov 2023 18:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘యానిమల్‌’ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా విడుదలైన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ట్రైలర్‌పై సినీ ప్రియులతో పాటు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. సందీప్ వంగా టేకింక్‌కు ‘వావ్‌’ అంటున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర తారలు దీనికి ఫిదా అయ్యామంటూ పోస్ట్‌లు పెట్టగా.. తాజాగా ప్రభాస్ (Prabhas) దీనికి రివ్యూ ఇచ్చారు.

‘‘యానిమల్‌’ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అందరి నటన మరో స్థాయిలో ఉంది’’ అన్నారు. సోషల్‌ మీడియాలో తక్కువ యాక్టివ్‌గా ఉండే ప్రభాస్ పోస్ట్‌ చేయడంతో అభిమానులు దాన్ని షేర్‌ చేస్తున్నారు. ఇక మరోవైపు బాలీవుడ్‌ ప్రముఖులు ఈ ట్రైలర్‌ను షేర్‌ చేస్తూ గూస్‌బంప్స్‌ వస్తున్నాయని పేర్కొంటున్నారు. అలియా భట్‌ కూడా దీనిపై పోస్ట్‌ పెట్టారు.‘‘ ట్రైలర్‌ చూస్తుంటే ఇప్పుడే సినిమా చూడాలనిపిస్తోంది. డిసెంబర్‌ 1 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. థియేటర్లో కచ్చితంగా ఆడియన్స్‌తో ఈలలు వేయిస్తుంది’’ అని రాసుకొచ్చారు. అలాగే కరీనా కపూర్‌ స్పందిస్తూ.. రణ్‌బీర్‌ (Ranbir Kapoor) మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలడని పేర్కొంటూ ‘యానిమల్’ టీమ్‌కు అభినందనలు తెలిపారు.

రష్మిక - విజయ్ దేవరకొండ.. లైవ్‌లో సీక్రెట్ చెప్పిన రణ్‌బీర్‌.. నటి షాక్

ఇక పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు ‘యానిమల్‌’ (Animal) డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం ఎప్పటికప్పుడు సినిమా విశేషాలను పంచుకుంటూ అంచనాలు కలిగించింది. తాజాగా విడుదలైన దీని ట్రైలర్ వాటిని రెట్టింపు చేసేలా ఉంది. అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఎక్కువమంది చూసిన హిందీ ట్రైలర్ల జాబితాలో మూడోస్థానాన్ని సొంతం చేసుకుంది. సందీప్‌ వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్జున్‌గా రణ్‌బీర్‌, గీతాంజలిగా రష్మిక కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని