kalki: ‘కల్కి’లో మరో తెలుగు నటుడు.. ఇంతకీ ఆయన ఎవరంటే?

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఇందులో మరో టాలీవుడ్‌ నటుడు భాగమయ్యారు.

Updated : 01 Mar 2024 19:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌ - ప్రభాస్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నటుడు రాజేంద్రప్రసాద్‌ భాగమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

‘కలియుగ పట్టణంలో..’ మూవీ టీజర్‌ విడుదల వేడుకకు హాజరైన రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘వందల కోట్లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. నేను ‘ప్రాజెక్ట్‌ కె’లో కూడా నటిస్తున్నాను. అలాగే మహేశ్‌బాబుతో ఓ సినిమా చేస్తున్నాను’ అని చెప్పారు. తాజాగా డైలాగ్‌ రైటర్‌ సాయి మాధవ్‌ బుర్రా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఇలాంటి కథతో సినిమా రాలేదన్నారు. పాన్‌వరల్డ్‌ లెవల్‌ సినిమా అన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్ లాంటి అగ్ర తారలకు డైలాగులు రాసే అవకాశం రావడం అదృష్టమని.. సినిమా హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంటుందని చెప్పారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

మెహందీ వేడుకలో ప్రగ్యా జైస్వాల్‌.. నేహాశెట్టి జర్నీ.. రాశీసింగ్‌ స్టిల్స్‌!

ఇప్పటికే ‘కల్కి’లో ఎంతోమంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు ఉన్నారు. ప్రభాస్ (Prabhas) సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దుల్కర్‌ సల్మాన్ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం దీని షూటింగ్‌ చివరి దశలో ఉంది. మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని