Rajinikanth: సాధారణ ప్రయాణికుడిలా కడపకు వచ్చిన రజనీకాంత్‌.. వీడియో వైరల్‌

Rajinikanth: వెట్టయాన్‌ మూవీ చిత్రీకరణ కోసం రజనీకాంత్‌ కడప విచ్చేశారు!

Updated : 01 Mar 2024 17:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆయన వెండితెరపై సూపర్‌స్టార్‌ కావచ్చు.. కానీ, బయటకు వస్తే అతి సామాన్యుడు. అందరిలో కలిసిపోతారు. ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనే రజనీకాంత్‌ (Rajinikanth). టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టయాన్‌’. తెలుగులో ‘వేటగాడు’ పేరుతో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ కడపలో జరుగుతోంది. ఈసందర్భంగా చెన్నై నుంచి కడపకు రజనీకాంత్‌ ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్‌లో వచ్చారు. విమానంలో ఆయన కూర్చొన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఎయిర్‌ పాడ్స్‌ పెట్టుకుని సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆయన ప్రయాణించారు. రజనీకాంత్‌ తమ విమానంలో ప్రయాణిస్తున్నారన్న విషయం తెలియడంతో అందులోని ప్రయాణికులందరూ ఆనందంతో పొంగిపోయారు. రజనీని అంత దగ్గరగా చూసి తెగ సంబరపడిపోయారు.

ఇటీవల రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలామ్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఈ మూవీని తెరకెక్కించారు. ఇక కొత్త చిత్రం ‘వెట్టయాన్‌’ విషయానికొస్తే, అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి చివరికి ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీ ఓ చిత్రంలో నటిస్తారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని