Ram Charan: డాక్టర్ రామ్చరణ్
కథానాయకుడు రామ్చరణ్ గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు. వినోద రంగంలో చేసిన సేవలకిగానూ తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఈ గౌరవాన్ని పొందారు.
కథానాయకుడు రామ్చరణ్ గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు. వినోద రంగంలో చేసిన సేవలకిగానూ తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఈ గౌరవాన్ని పొందారు. శనివారం చెన్నైలో జరిగిన విశ్వ విద్యాలయ స్నాతకోత్సవానికి హాజరైన రామ్చరణ్కు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ టి.జి.సీతారాం, విశ్వ విద్యాలయం ఛాన్సలర్, ఛైర్మన్ ఇషారి కె.గణేశ్ కలిసి డాక్టరేట్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ‘‘నా సేవల్ని గుర్తించి, నాపై ఇంత ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తూ డాక్టరేట్ని ప్రదానం చేసిన వేల్స్ విశ్వ విద్యాలయానికి నా ధన్యవాదాలు. ఈ గౌరవం నాది కాదు. నా అభిమానులు, దర్శకులు, నిర్మాతలు, తోటి నటీనటులకి చెందుతుంది. చెన్నై నాకెంతో ఇచ్చింది. నేను ఇక్కడే పుట్టాను. మా నాన్న ఇక్కడి నుంచే ప్రయాణం ప్రారంభించారు. తెలుగు చిత్రపరిశ్రమలో ఎనభై శాతం మందికి చెన్నైతో అనుబంధం ఉంది. ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఇక్కడికి వస్తే అది తప్పక నెరవేరుతుంది. అదీ ఈ ప్రాంతానికి ఉన్న గొప్పతనం. శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాలని చాలా మంది అనుకుంటారు. ఆయనతో ‘గేమ్ ఛేంజర్’ చేయడం ఓ గొప్ప అనుభవం’’ అన్నారు.
గర్వంగా ఉంది: చిరంజీవి: రామ్చరణ్ డాక్టరేట్ అందుకోవడంపై ఆయన తండ్రి, ప్రముఖ కథానాయకుడు చిరంజీవి తన ఆనందాన్ని ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ‘‘ఇవి భావోద్వేగంతో కూడిన క్షణాలు. పిల్లలు విజయాల్ని సాధిస్తున్నప్పుడే తల్లిదండ్రులకు అసలైన ఆనందం. వేల్స్ విశ్వ విద్యాలయం రామ్చరణ్కు డాక్టరేట్ అందించడం చూసి గర్వపడుతున్నా. చెప్పలేనంత ఆనందంగా ఉంది. లవ్ యూ డాక్టర్ రామ్చరణ్’’ అంటూ పోస్ట్ని పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి
‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్. -
అక్టోబరులో మొదలు!
‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. -
రజనీ బయోపిక్ రానుందా?
సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. -
కృష్ణమ్మ.. అందరూ మాట్లాడుకునే చిత్రమవుతుంది
‘‘సత్యదేవ్ అద్భుతమైన నటుడని అందరికీ తెలుసు. అలాంటి నటుడికి ఒక సరైన సినిమా పడితే చాలు ఊహించని స్టార్డమ్ వస్తుంది. -
మనం నవ్వుతుంటే ప్రేక్షకులు భయపడాలి!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఆ మార్పు నాలో విశ్వాసాన్ని నింపింది
‘ప్రేక్షకుల్లో వచ్చిన ఈ మార్పు నాలో విశ్వాసాన్ని పెంచుతుంది’ అని అంటోంది బాలీవుడ్ నాయిక తాప్సీ. -
సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. -
ఇందులో అన్నీ ఉంటాయి
‘‘ప్రేక్షకులకు చాలా తృప్తినిచ్చే సినిమా ‘ప్రసన్న వదనం’. దీన్ని సీటు అంచున కూర్చొని ఆస్వాదిస్తారు. అదిరిపోయిందని చప్పట్లు కొడతారు’’ అన్నారు సుహాస్. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు.