Rana- Mrunal Thakur: రానా- మృణాళ్ ఠాకూర్ ఫొటోలు వైరల్.. ఎక్కడ మెరిశారంటే?
హీరో హీరోయిన్లు రానా, మృణాళ్ ఠాకూర్ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఆ ఫొటోల వెనుక ఉన్న సంగతేంటంటే?
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ హీరో రానా (Rana Daggubati), హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) కలిసి దిగిన ఫొటోలు నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అవి ప్రస్తుతం వైరల్గా మారాయి. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలోనో, వెబ్సిరీస్లోనో నటిస్తున్నారేమోనని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాంబోలో ‘రానా నాయుడు 2’ సిరీస్ వస్తుందని కొందరు జోస్యం చెబుతున్నారు. ఇంతకీ వీరు కలిసి ఫొటో దిగడానికి కారణమేంటంటే?
సినిమా పరిశ్రమలో అందించే ప్రముఖ అవార్డుల్లో ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) (SIIMA)’ ఒకటి. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సినిమాలు, నటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి అందించే ఈ అవార్డుల కార్యక్రమం ఈ ఏడాది సెప్టెంబరు 15, 16న దుబాయ్లో జరగనుంది. ఈసారి సైమాతో కలిసి ‘నెక్సా’ భాగస్వామి కానుంది. ఈ మేరకు దుబాయ్లో నిర్వహించిన ‘నెక్సా సైమా పార్ట్నర్షిప్’ కార్యక్రమానికి రానా, మృణాళ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన ‘సైమా’ ఛైర్పర్సన్ బృందా ప్రసాద్కి మృణాళ్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. రానాతో వేదికను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. రానా, ఆయన బాబాయ్ వెంకటేశ్ కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ (Rana Naidu) ప్రచారంలో భాగంగా మృణాళ్ ఓ స్కిట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో.. తన ఈ-మెయిల్ ఖాతా హ్యాక్కు గురైందంటూ.. సమస్య పరిష్కారానికి రానాను సంప్రదిస్తారు మృణాళ్. అప్పుడు అలా ప్రత్యేక వీడియోలో నటించడం, ఇప్పుడిలా ఒకే వేదికపై కనిపించడంతో వీరిద్దరు ‘రానా నాయుడు’ పార్ట్ 2లో నటిస్తారని పలువురు అభిప్రాయపడ్డారు.
‘భీమ్లా నాయక్’, ‘విరాటపర్వం’ చిత్రాలతో గతేడాది అలరించిన రానా.. ఇటీవల ‘స్పై’ (Spy)లో అతిథిగా కనిపించారు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. ‘సీతారామం’లో సీత పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాళ్.. హీరో నాని (Nani) సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. #nani30 వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబరు 21న విడుదల కానుంది. మరోవైపు, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో మృణాళ్ హీరోయిన్గా నటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్