Rana: జాతీయ అవార్డుల కాంట్రవర్సీపై స్పందించిన రానా.. ఏమన్నారంటే?

‘జైభీమ్‌’ సినిమాకు జాతీయ అవార్డులు రాకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రానా స్పందించారు.

Published : 04 Sep 2023 13:51 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ లిస్ట్‌లో సూర్య హీరోగా నటించిన ‘జైభీమ్‌’ (Jai Bhim) సినిమా లేకపోవడంతో ఎంతో మంది నిరాశపడ్డారు. అభిమానుల నుంచి సినీ ప్రముఖుల వరకూ దీనిపై స్పందిస్తూ ట్వీట్స్‌ చేశారు. వాటిలో కొన్ని తీవ్ర చర్చనీయాంశం కాగా.. మరికొన్ని వివాదాలకు దారితీశాయి. తాజాగా దీనిపై హీరో రానా స్పందించారు. సైమా అవార్డులకు సంబంధించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దీనిపై మాట్లాడారు.

‘‘సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవు. మీ అందరికీ ఒక చిత్రం నచ్చి ఉండొచ్చు. నాకు మరొకటి బాగుందనిపించవచ్చు. నటుల అభిరుచులు కూడా అలానే ఉంటాయి. ‘జైభీమ్‌’ సినిమా కథకు జాతీయ అవార్డు వస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ అది ఎంపిక కాలేదు. దీంతో కొందరు వారి అభిప్రాయాన్ని తెలుపుతూ ట్వీట్స్‌ చేశారు. అంతేకానీ కాంట్రవర్సీ చేయాలని కాదు. వాళ్లు కేవలం ట్వీట్‌ మాత్రమే చేశారు. కొందరు దాన్ని కాంట్రవర్సీగా మార్చారు. మా (ఆర్టిస్టుల) మధ్య ఎలాంటి వివాదాలు ఉండవు’’ అని రానా అన్నారు.

ఇక జాతీయ అవార్డులు ప్రకటించిన తర్వాత చాలా మంది ప్రముఖులు ‘జైభీమ్‌’ విషయంలో ట్వీట్స్‌ చేశారు. హీరో నాని ( Nani) కూడా ‘జైభీమ్‌’కు జాతీయ అవార్డు రాకపోవడంతో తన హృదయం ముక్కలైందని ఇన్‌స్టా స్టోరీలో అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇక తమిళ చిత్రపరిశ్రమకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ అవార్డులపై పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని