Rashmika: శ్రీవల్లి 2.0ను చూస్తారు!

‘పుష్ప 2’లో శ్రీవల్లి 2.0ని చూస్తారని వ్యాఖ్యలు చేసి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది రష్మిక.

Updated : 15 Apr 2024 12:00 IST

‘పుష్ప 2’లో శ్రీవల్లి 2.0ని చూస్తారని వ్యాఖ్యలు చేసి అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది రష్మిక. ఆమె.. అల్లు అర్జున్‌కి జోడీగా ‘పుష్ప’లో మెప్పించే నటనతో మంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ‘పుష్ప 2’లో సందడి చేయడానికి ముస్తాబవుతోందీ భామ. రాబోయే స్వీకెల్‌లో తన పాత్ర గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది రష్మిక.

‘‘పుష్ప: ది రైజ్‌’లో అవకాశం వచ్చినప్పుడు కథ గురించి మొదట్లో నాకు ఎలాంటి అవగాహన లేదు. శ్రీవల్లి పాత్ర ఎలా ఉంటుందో తెలియదు. మేము ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తున్నామో కూడా ఊహించలేకపోయాను. దీంతో ఎప్పుడూ సెట్లో అడుగు పెట్టినా ఖాళీ మైదానంలో తిరుగుతున్న భావన కలిగేది. కానీ.. ఇప్పుడు అలా కాదు. నా పాత్ర గురించి పూర్తిగా తెలుసు. దాని కోసం నేను ఎలాంటి కసరత్తులు చేయాలో కూడా అవగాహన ఉంది. మొదటి భాగంలో కన్నా మరింత బలంగా ఉండబోతుంది నా పాత్ర. రాబోయే సీక్వెల్‌లో శ్రీవల్లి 2.0ను చూస్తార’’ని అంది. ‘‘ఇప్పటివరకు నేను నటించిన సినిమాలన్నింటిలో ‘డియర్‌ కామ్రేడ్‌’ నా హృదయానికి ఎంతో దగ్గరైంది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవచ్చు. కానీ ఇందులో నా నటనకు ఇప్పటికీ నేను ఎంతోమంది అభిమానుల ప్రశంసలు, ప్రేమను అందుకుంటున్నాన’’ని తనకు ఇష్టమైన చిత్రం గురించి చెప్పుకొచ్చింది రష్మిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని