Rashmika: వాటిని చూసి నా హృదయం ముక్కలైంది: రష్మిక
‘పుష్ప’ తర్వాత కెరీర్లో జోరు పెంచారు నటి రష్మిక. టాలీవుడ్తోపాటు బాలీవుడ్, కోలీవుడ్లలో వరుస సినిమాలు చేస్తోన్న ఈ భామ తాజాగా సోషల్మీడియా ట్రోలింగ్పై పెదవి విప్పారు. ఈ విధమైన ట్రోల్స్ వల్ల తాను ఎన్నోసార్లు బాధపడినట్లు చెప్పారు.
ఇంటర్నెట్డెస్క్: సోషల్మీడియా వేదికగా తన గురించి వస్తోన్న నెగెటివిటీపై నటి రష్మిక (Rashmika) స్పందించారు. వివరణాత్మక విమర్శలను తాను స్వాగతిస్తానని.. నటిగా ఎదగడానికి అవి ఉపయోగపడతాయని అన్నారు. కానీ, నీచమైన ద్వేషం వల్ల లాభం ఏంటని ప్రశ్నిస్తూ ఇన్స్టా వేదికగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు.
‘‘ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని ఇప్పుడు మీతో పంచుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నా. నటిగా కెరీర్ మొదలైన నాటి నుంచీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నా. సోషల్మీడియాలో వచ్చే ట్రోల్స్, నెగెటివిటీ నన్ను బాధపెట్టాయి. అయితే.. నేను ఎంచుకున్న జీవితం అలాంటిది. ఇక్కడ అందరికీ నేను నచ్చనని.. అలాగే, ప్రతిఒక్కరి ప్రేమను పొందాలనుకోకూడదని అర్థమైంది. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ప్రతిరోజూ కష్టపడి పనిచేయడం మాత్రమే నాకు తెలుసు. మీరూ, నేనూ గర్వించే విధంగా పనిచేసేందుకే శ్రమిస్తున్నా. అందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా’’
‘‘నేను మాట్లాడని విషయాల గురించి కూడా నన్ను హేళన చేస్తూ సోషల్మీడియాలో పోస్టులు పెట్టారు. వాటిని చూసి నా హృదయం ముక్కలైంది. పలు ఇంటర్వ్యూల్లో నేను మాట్లాడిన కొన్ని మాటలు నాకు వ్యతిరేకంగా మారడాన్ని గుర్తించా. ఇంటర్నెట్లో వస్తోన్న తప్పుడు సమాచారం వల్ల నాకే కాకుండా నా సహచరులకు ఇబ్బంది కలిగింది’’
విమర్శలను పట్టించుకోకూడదని ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నా. కానీ, ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. సోషల్మీడియా నెగెటివిటీ గురించి మాట్లాడి నేను ఎవరిమీదనో విజయం సాధించానని అనుకోవడం లేదు. నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరిపై నాకు ప్రేమాభిమానం ఉంది. ఇప్పటి వరకూ నేను పనిచేసిన నటీనటుల నుంచి ఎన్నో విషయాల్లో ప్రేరణ పొందా. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే ఇంతటి గుర్తింపు తెచ్చుకున్నా’’ అంటూ రష్మిక పేర్కొన్నారు.
ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది. దీనిని చూసిన సినీ సెలబ్రిటీలు హన్సిక, విమలారామన్, తాన్యా హోప్, దుల్కర్ సల్మాన్, వెంకీ కుడుముల తదితరులు ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ‘మా అభిమానం నీకు ఎప్పుడూ ఉంటుంది. ద్వేషం చూపించే వారిని పట్టించుకోవద్దు’ అని రిప్లైలు ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. చైనీస్, జపనీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. -
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
‘రత్నం’ (Rathnam) రిలీజ్లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో నటుడు విశాల్ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. -
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్ శర్మ
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ఖాన్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్’. దీని ప్రమోషన్స్లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. -
ఈ క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా: ‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ
‘హనుమాన్’ (Hanuman) విజయంపై మరోసారి స్పందించారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth varma). ఈ సినిమా విడుదలై వందరోజులు దాటిన సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. -
రామ్చరణ్ అంటే నాకెంతో ఇష్టం..: బాలీవుడ్ నటి
నటుడు రామ్చరణ్ అంటే తనకెంతో ఇష్టమన్నారు బాలీవుడ్ నటి మానుషి చిల్లర్. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందని తెలిపారు. -
దావుద్ పార్టీలో డ్యాన్స్.. అక్షయ్కుమార్ సతీమణి ఏమన్నారంటే..?
అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీం(Dawood Ibrahim) కోసం అక్షయ్ కుమార్ సతీమణి, నటి ట్వింకిల్ ఖన్నా డ్యాన్సులు చేసినట్లు దాదాపు పదేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆయా కథనాలపై తాజాగా ఆమె స్పందించారు. -
‘రెయిన్బో’ డ్రెస్సులో పాయల్.. సోఫాలో మానస.. ఊయలూగుతూ శివాత్మిక!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓ ఇంటివాడైన నటుడు తిరువీర్.. ఫొటోలు చూశారా!
నటుడు తిరువీర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. -
కార్మికుల కోసం అడగ్గానే అంగీకరించారు: చిరంజీవి
ప్రముఖ హీరో చిరంజీవి హైదరాబాద్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని, సందడి చేశారు. ఆ సంగతులివీ.. -
నేను ఎప్పటికీ అలాంటి పాత్రలు పోషించను: ఆ సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి!
బాలీవుడు నటుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇండస్ట్రీకి దూరంగా ఉండటంపై స్పందించారు. -
యూట్యూబ్లో రవితేజ చిత్రం రికార్డు.. నిర్మాణ సంస్థ పోస్ట్
స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger nageswara rao). రవితేజ (ravi teja) కథానాయకుడిగా వంశీ దర్శకత్వం వహించిన చిత్రమిది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM