Tiger Nageswara Rao: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

రవితేజ తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

Published : 17 Nov 2023 11:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ (Raviteja) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  భారీ అంచనాల మధ్య దసరా కానుకుగా విడుదలైన ఈ చిత్రం మిశ్రమస్పందనలకే పరిమితమైంది. ఇప్పుడీ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon prime) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఇందులో రవితేజ సరసన నుపుర్‌ సనన్‌ నటించగా రేణు దేశాయ్‌ కీలకపాత్రలో కనిపించారు.

‘మై నేమ్ ఈజ్ శృతి’.. స్కిన్‌ మాఫియాను హన్సిక ఎలా ఎదుర్కొంది?

క‌థేంటంటే: 1970, 80 దశ‌కాల్లో స్టూవర్టుపురం నాగేశ్వ‌ర‌రావు పేరు వింటే చాలు... అటు ప్ర‌జల్లోనూ ఇటు పోలీసు వ్య‌వ‌స్థ‌లోనూ ఓ ర‌కమైన అల‌జ‌డి మొద‌ల‌య్యేది. దోపిడీల‌కి పెట్టింది పేరైన నాగేశ్వ‌ర‌రావు కన్నుప‌డిందంటే చాలు... ఎంత విలువైన‌దైనా, ఎంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉన్నా చెప్పి మ‌రీ దొంగ‌త‌నం చేస్తాడని పేరు. త‌ను దొంగ‌త‌నాలు చేసే ప్రాంతాన్ని టైగ‌ర్ జోన్ అనీ... అత‌న్ని  టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనీ పిలుస్తుంటారు. ఇప్ప‌టికీ ఆయ‌న గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొంటుంటారు. అంత పేరు మోసిన దొంగ క‌థ‌తో రూపొందిన చిత్ర‌మే.. ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’. టైటిల్ పాత్ర‌లో ర‌వితేజ న‌టించారు. 1980 నేప‌థ్యంలో క‌థ  మొద‌ల‌వుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స్టూవ‌ర్టుపురం గ్రామానికి చెందిన నాగేశ్వ‌ర‌రావు గురించి దిల్లీలో చ‌ర్చ మొద‌ల‌వుతుంది. (Tiger Nageswara Rao OTT) ప్ర‌ధానమంత్రి భ‌ద్ర‌తని స‌మీక్షించే ఇంటిలిజెన్స్ అధికారి రాజ్‌పుత్ (అనుప‌మ్ ఖేర్‌) స్వ‌యంగా రంగంలోకి దిగి స్టూవర్టుపురం గురించి తెలిసిన పోలీస్ అధికారి విశ్వ‌నాథ్ శాస్త్రి (ముర‌ళీశ‌ర్మ‌)ని పిలిపించి నాగేశ్వ‌ర‌రావు గురించి ఆరా తీయ‌డం మొద‌లుపెడ‌తారు. అందుకు కార‌ణ‌మేంటి?అస‌లు ఈ దోపిడీల‌కి పాల్ప‌డుతున్న నాగేశ్వ‌ర‌రావు ల‌క్ష్యం ఏమిటనేది అస‌లు క‌థ‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని