Sai Dharam Tej: సాయిధరమ్‌ తేజ్‌ మంచి మనసు: ఒక్క మెసేజ్‌కే స్పందించిన హీరో

హీరో సాయిధరమ్‌ తేజ్‌ తన మంచి మనసును చాటుకున్నారు. 

Published : 23 Feb 2024 19:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక కార్యక్రమాల్లో ముందుండే హీరోల్లో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) ఒకరు. ఆయన మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఓ అనాథ ఆశ్రమంలో ఉండే ఇద్దరు చిన్నారుల చికిత్సకు సాయం అందించారు. ఈవిషయాన్ని సినిమాటోగ్రాఫర్‌ ఆండ్రూ బాబు సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ఇద్దరు పిల్లల ట్రీట్‌మెంట్‌ కోసం సాయం కోరుతూ అనాథ ఆశ్రమం నుంచి ఫోన్‌ వచ్చిందని, ఆ సమయంలో తనకు సాయిధరమ్‌ తేజ్‌ మాత్రమే గుర్తొచ్చారని, ఆమేరకు ఒక్క మెసేజ్‌ పెట్టగానే ఏం ఆలోచించకుండా ఆయన హెల్ప్‌ చేశారని ఆండ్రూ పోస్ట్‌ పెట్టారు. ఆ చిన్నారులు సాయితేజ్‌కు కృతజ్ఞతలు తెలిపే వీడియోను పంచుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని చార్లెట్‌ అనాథ ఆశ్రమం అది.

తన పుట్టినరోజును పురస్కరించుకుని సాయితేజ్‌ గతేడాది అక్టోబరులో సైనిక కుటుంబాలకు, ఏపీ, తెలంగాణ పోలీసులకు రూ.20 లక్షల సాయం చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందూ పలు సందర్భాల్లో తన మంచి మనసు చాటుకున్నారాయన. సినిమాల విషయాకొనిస్తే.. ‘బ్రో’, ‘విరూపాక్ష’లతో అలరించిన ఆయన ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘గాంజా శంకర్‌’ పేరు ఖరారుకాగా గాంజా పదాన్ని తొలగించాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) పోలీసులు ఇటీవల నోటీసులు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని