Yash 19: యశ్‌కు జోడిగా సాయి పల్లవి!.. వైరలవుతోన్న వార్త

హీరో యశ్ తర్వాత సినిమాకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Published : 06 Dec 2023 15:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీఎఫ్‌’ స్టార్‌ యశ్‌ తాజాగా కొత్త సినిమాను (Yash 19) ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఆయన నుంచి అప్‌డేట్‌ రావడంతో అభిమానులంతా సంబరపడుతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఏ వార్త బయటకొచ్చినా అది వైరల్‌గా మారుతోంది. ఇప్పటికే ఈ సినిమా డైరెక్టర్‌ విషయంలో ఎన్నో వార్తలు వచ్చాయి.

తాజాగా ఇందులో హీరోయిన్‌ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో యశ్‌ సరసన సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే చిత్రబృందం సాయి పల్లవిని సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు సమాచారం. ఈ చిత్రంతోనే ఆమె కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సాయి పల్లవి రెండు ప్రాజెక్ట్‌లు చేస్తోంది. ఇప్పుడు ఇది కూడా ఓకే అయితే వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాల్లో ఆమె కనిపిస్తుందని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

డీప్‌ ఫేక్‌ బారిన ప్రియాంక చోప్రా.. నకిలీ వీడియో వైరల్‌

ఇక ‘యశ్‌19’ విషయానికొస్తే.. దీన్ని మలయాళ దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను డిసెంబర్‌8న ప్రకటించనున్నారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన కథ అని టాక్‌. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనుల కోసం యశ్ ఇటీవల లండన్ కూడా వెళ్లారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ గురించి యశ్‌ మాట్లాడుతూ.. అభిమానులకు సగం ఉడికించిన ఆహారాన్ని అందించడం తనకు ఇష్టంలేదని.. అందరూ గర్వపడే సినిమా తీయనున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని