Salaar2: ‘సలార్2’పై వైరలవుతోన్న వార్తలో నిజమెంత.. ప్రశాంత్ నీల్ ఏం చెప్పారంటే!
సోషల్ మీడియాలో ‘సలార్2’కు సంబంధించిన ఓ వార్త తెగ ప్రచారమవుతోంది. దీన్ని ఖండిస్తూ ప్రభాస్ అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరలవుతోన్న ఓ వార్త ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులను కలవరపెడుతోంది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘సలార్: సీజ్ ఫైర్’ సీక్వెల్ ఆగిపోయిందంటూ వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ప్రభాస్కు, ప్రశాంత్ నీల్కు (prashanth neel) మధ్య క్రియేటివ్ డిఫరెన్స్లు వచ్చాయని అందుకే ‘పార్ట్ 2’ అటకెక్కిందని ఆ వార్తల సారాంశం. అయితే, ఈ సీక్వెల్ ఆగిపోదంటూ ప్రభాస్ అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు. ఫేక్ న్యూస్ను ప్రచారం చేయొద్దని కోరుకుంటున్నారు. గతంలో ఈ భారీ సీక్వెల్ గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడిన వీడియోలను, నటీనటులు ‘సలార్2’ షూటింగ్పై ఇచ్చిన అప్డేట్లను షేర్ చేస్తున్నారు.
‘సలార్2’ (Salaar 2) సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని ప్రశాంత్నీల్ గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. త్వరలోనే దీని షూటింగ్ కూడా ప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేశారు. ‘కేజీఎఫ్2’ షూటింగ్ పూర్తవగానే ప్రశాంత్ నీల్ ‘సలార్’ పనులు ప్రారంభించారు. అందుకే వీటి సీక్వెల్స్ తెరకెక్కించే ముందు ఆయన కొంత విరామం తీసుకోనున్నట్లు ఇంతకుముందు చెప్పారు. ‘సలార్’ విడుదలై కూడా ఐదు నెలలు దాటింది. ఇక ప్రశాంత్ నీల్ త్వరలోనే ‘సలార్2’ పనులు ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రభాస్ (Prabhas) కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నందున మొదట ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
గతేడాది డిసెంబర్లో విడుదలైన ‘సలార్’.. అన్ని ప్రాంతాల్లోనూ భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పార్ట్-2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ‘సలార్ 2’ ఆగిపోయే ప్రశ్నే లేదంటున్నారు సినీ పండితులు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ‘సలార్’ కథను ప్రశాంత్ నీల్ 15 ఏళ్ల క్రితమే అనుకున్నారు. అప్పటినుంచి దానికి సంబంధించిన వర్క్ చేసుకుంటూ వచ్చారాయన. మొదటి భాగాన్ని ‘సలార్: సీజ్ ఫైర్’ పేరుతో విడుదల చేయగా రెండో భాగాన్ని ‘సలార్: శౌర్యంగపర్వం’ పేరుతో ప్రేక్షకులకు అందించనున్నట్లు గతంలోనే స్పష్టంచేశారు. పార్ట్-1తో పోలిస్తే రెండో దాంట్లో ప్రభాస్, పృథ్వీరాజ్ల మధ్య అసలైన సంఘర్షణ మొదలవుతుంది. ఖాన్సార్ కుర్చీ కోసం జరిగే రాజకీయాలు, మలుపులు, యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. హాలీవుడ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇన్ని అప్డేట్ల మధ్య సలార్2పై వస్తోన్న వార్తలు నిజాలు కావని అర్థమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’పై కత్రినాకైఫ్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. -
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
నటి టబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
‘కల్కి’ స్క్రిప్ట్ రాయడానికి చాలా సమయం పట్టిందని దర్శకుడు నాగ్అశ్విన్ అన్నారు. అశ్వత్థామ పాత్రకు అమితాబ్ను తప్ప మరొకరిని ఊహించుకోలేదని చెప్పారు. -
ఎన్టీఆర్కు ఒక్క సెకను.. నాకు 10 రోజులు: జాన్వీకపూర్
టాలీవుడ్పై నటి జాన్వీ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ హీరో అని ప్రశంసించారు. -
రెడ్ శారీలో కృతిశెట్టి ఇలా.. మాళవికా మోహనన్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ ఉద్యోగం నాకు నచ్చలేదు.. యూటర్న్ తీసుకున్నా: సూర్య
‘అగరం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో నటుడు సూర్య (Suriya) పాల్గొన్నారు. తన లైఫ్ స్టోరీతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. -
ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు.. అంధులకు బెల్లకొండ శ్రీనివాస్ సాయం
తాను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంధులకు సాయం చేశారు బెల్లకొండ సాయి శ్రీనివాస్ -
ఆయన్ని చూడగానే కన్నీళ్లు ఆగలేదు: తమన్
తన జీవితంలో కీలక పాత్ర పోషించిన పలువురు వ్యక్తుల గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman) తాజాగా ఓ సంగీత కార్యక్రమంలో మాట్లాడారు. -
పేరు మార్చుకున్న పూరీ జగన్నాథ్ తనయుడు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ పేరు మార్చుకున్నారు. -
యూట్యూబ్లో రామ్ మూవీ సంచలనం.. హిందీలో హవా..
రామ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘స్కంద’(Skanda). దీని హిందీ వెర్షన్ యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. -
‘పుష్ప 2’ ఆలస్యంపై అల్లు శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పుష్ప 2’ (Pushpa2) పై అల్లు అర్జున్ (Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించారు. సుకుమార్ అద్భుతంగా దీనిని తీర్చిదిద్దుతున్నారన్నారు. -
బిగ్ కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి కారణమదే: జాన్వీకపూర్
నటి జాన్వీకపూర్ (Janhvi Kapoor) తాజాగా ఓ చిట్చాట్లో పాల్గొన్నారు. బిగ్ కమర్షియల్ చిత్రాల్లో నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు. -
బాకీ చెల్లించలేదు.. ఆ నిర్మాతలు నన్ను మోసం చేశారు: అక్షయ్కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ తాజాగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తన కెరీర్, వరుస పరాజయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. -
రెండోసారి తల్లి కాబోతున్న నటి.. ఫొటోలు వైరల్
నటి ప్రణీత రెండోసారి గుడ్ న్యూస్ చెప్పారు. బేబీ బంప్ ఫొటోలను షేర్ చేశారు. -
ఆ సమయంలో సూర్య వైపు చూడటానికి భయపడ్డా: రాధికా మదన్
‘సర్ఫిరా’తో ఇటీవల సినీ ప్రియులను అలరించారు నటి రాధికామదన్(Radhika Madan). తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ చిత్ర నిర్మాత సూర్య (Suriya) గురించి మాట్లాడారు. -
జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే: సమంత
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
ఆ క్షణం కిరణ్రావు కన్నీళ్లు పెట్టుకున్నారు: ‘లాపతా లేడీస్’ నటి
‘లాపతా లేడీస్’తో 16 ఏళ్ల నితాన్షి గోయెల్ నటిగా తెరంగేట్రం చేసింది. ప్రేక్షకుల మనసుని హత్తుకునే ప్రదర్శనతో తొలి చిత్రంతోనే ఆమె ప్రశంసలు దక్కించుకుంది. -
ఆ సన్నివేశం గురించి దర్శకుడు ముందు చెప్పలేదు: మాళవిక మోహనన్
‘తంగలాన్’ సినిమాలో గేదెపై కూర్చునే సన్నివేశం గురించి దర్శకుడు తనకు ముందుగా చెప్పలేదని మాళవిక మోహనన్ అన్నారు. -
తమన్నా ప్రచారం.. రుక్సర్ మేకప్.. లక్ష్మీరాయ్ ‘వాటర్ బేబీ’!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మీకు దుర్భాషలాడడం మాత్రమే వచ్చు: అనసూయ
‘మీకు దుర్భాషలాడడమే వచ్చు’ అంటూ అనసూయ పెట్టిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశమైంది. -
ఒలింపిక్స్ వీక్షణకు పయనం.. చిరంజీవి ఫ్యామిలీ ఫొటో వైరల్
చిరంజీవి షేర్ చేసిన ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!