Sameera Reddy: బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకోవాలని బలవంతం పెట్టారు: సమీరా రెడ్డి

కెరీర్‌ టాప్‌లో ఉన్న సమయంలోనే బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకోవాలని తనని కొందరు బలవంతం పెట్టినట్లు సమీరా రెడ్డి తెలిపారు.

Published : 10 Jun 2024 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు నటి సమీరా రెడ్డి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన (Sameera Reddy) కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు.

‘నా కెరీర్‌ టాప్‌లో ఉన్నప్పుడు నాపై కొందరు ఒత్తిడి తెచ్చారు. బ్రెస్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సర్జరీ చేయించుకోవాలని బలవంతం పెట్టారు. ‘ఎంతోమంది హీరోయిన్లు చేయించుకున్నారు. నీకేమైంది’ అనేవారు. నాకు ఇష్టం లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. నా శరీరంతో ఎలాంటి సమస్య లేనప్పుడు సర్జరీ చేయించుకోనని చెప్పాను. కొందరు నటీనటులు వారి వయసును దాచేస్తుంటారు. నేను అలా కాదు.. గూగుల్లో నా వయసు రెండేళ్లు తక్కువ చూపిస్తుంటే దాన్ని సరిచేశాను. 40ఏళ్లు పైబడినా నేను ఎంతో ఉత్సాహంగా ఉంటున్నా. నా చర్మం డల్‌గా ఉన్నప్పుడూ సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తాను. మేకప్‌ వేసుకున్నప్పుడు కూడా పంచుకుంటాను. అలా చేయడం వల్ల నాలాంటి ఎంతోమంది మహిళలు స్ఫూర్తిపొందుతారని నేను భావిస్తా’ అని చెప్పారు.

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ.. ప్రకటించిన దర్శకుడు

చిరంజీవి (Chiranjeevi), ఎన్టీఆర్‌లతో నటించి సమీరారెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రానా హీరోగా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’ సినిమాలో ప్రత్యేక గీతంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు సినిమాల్లో కనిపించారు. చివరిగా 2013లో కన్నడ చిత్రంలో నటించారు. ప్రస్తుతం నటనకు విరామం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు