Saranya: పార్కింగ్‌ వివాదం.. నటిపై కేసు నమోదు..?

కోలీవుడ్‌ నటి శరణ్య పొన్వన్నన్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

Published : 01 Apr 2024 19:51 IST

ఇంటర్నెట్‌డెస్క్: కోలీవుడ్‌, టాలీవుడ్‌ల్లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో తల్లి పాత్రలు పోషించి ప్రేక్షకులకు చేరువయ్యారు నటి శరణ్య పొన్వన్నన్‌ (Saranya Ponvannan). తాజాగా ఆమె వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పార్కింగ్‌ విషయంలో వాగ్వాదం చెలరేగడంతో శరణ్యపై ఓ మహిళ కేసు నమోదు చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆయా కథనాల ప్రకారం.. చెన్నైలోని విరుగంబాక్కంలో నివశిస్తున్నారు నటి శరణ్య. గత కొన్ని రోజుల నుంచి ఆమె పొరిగింట్లో ఉంటోన్న శ్రీదేవి అనే మహిళతో పార్కింగ్‌ విషయంలో గొడవలు తలెత్తాయని సమాచారం. తనని ఇబ్బందిపెడితే ఊరుకోనంటూ నటి బెదిరించిందని పేర్కొంటూ శ్రీదేవి తాజాగా పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘రఘువరన్‌ బీటెక్‌’, ‘24’, ‘వేదం’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘మహాసముద్రం’, ‘ఖుషి’ వంటి చిత్రాలతో శరణ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు