Shaakuntalam: అలా నేను వేసిన తొలి అడుగు ‘శాకుంతలం’: దిల్ రాజు
వీఎఫ్ఎక్స్ నేర్చుకునేందుకే ‘శాకుంతలం’ ప్రాజెక్టులో భాగమయ్యానని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆ సినిమా 3డీ ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: సమంత (Samantha) ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ (Guna Sekhar) తెరకెక్కించిన చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam). దేవ్ మోహన్, మోహన్ బాబు, గౌతమి, మధుబాల, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం 3డీ వెర్షన్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో గుణ శేఖర్, నిర్మాతలు దిల్ రాజు, నీలిమ గుణ, రచయిత సాయి మాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు.
దిల్రాజు మాట్లాడుతూ.. ‘‘ఇంతింతై వటుడింతై అన్నట్టుగా తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తమైంది. సమంత మేనేజరు ఓ రోజు నా దగ్గరకు వచ్చి ‘దర్శకుడు గుణ శేఖర్.. సమంతతో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. మీరు కథ వినండి’ అని అనగానే.. సరేనన్నాను. గుణ శేఖర్కి ఏదో విధంగా సాయం చేసేందుకే నేనీ సినిమాలో భాగం అయ్యానని చాలామంది అనుకున్నారు. కానీ, నేను స్వార్థంతో వారితో చేయి కలిపా. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్కు చేరుకుంది. వీఎఫ్ఎక్స్ గురించి నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టులో చేరా. సాధారణంగా ఇలాంటి సినిమాల విషయంలో నిర్మాతలకు పెద్దగా పని ఉండదు. అలా అని నేను ఖాళీగా ఉండలేదు. ‘బాహుబలి’తో తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అలా మరిన్ని తెలుగు సినిమాలను ప్రపంచానికి చూపించాలనే ఆలోచనతో నేను వేసిన తొలి అడుగు ఈ ‘శాకుంతలం’. బ్యూటీఫుల్ ఫ్యామిలీ డ్రామా విజువల్ వండర్గా ఈ సినిమా రూపొందింది. మన తర్వాతి తరానికి ఈ కథ తెలియాలి. సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు అల్లు అర్హ రూపంలో ఓ సర్ప్రైజ్ ఉంటుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 19 నిమిషాలు’’ అని దిల్ రాజు తెలిపారు.
కొన్ని మార్పులంతే: గుణ శేఖర్
‘‘మహాభారతంలోని దుష్యంతుడు, శకుంతల కథను ఆధారంగా చేసుకుని కాళిదాసు.. అభిజ్ఞాన శాకుంతలం నాటకం రాశారు. దాన్ని విజువల్గా మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో కొన్ని మార్పులు చేశాం. 90 శాతం ఒరిజినల్ స్టోరీనే తెరకెక్కించాం. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది. వారిని ఇంప్రెస్ చేయడమే నా ముందున్న సవాలు. సమంత.. శకుంతల పాత్రకు ప్రాణం పోశారు. దిల్ రాజుగారు నిత్య విద్యార్థి. ప్రతి రోజూ ఆయన కొత్త విషయాలను నేర్చుకుంటుంటారు. తెలుగు సినిమా వెగిలిపోతుందంటే దిల్రాజులాంటి నిర్మాతలే కారణం. ఆయన సినిమాని నిలబెట్టేందుకు చాలా కష్టపడతారు. నేనీ చిత్రాన్ని సమంతతో చేయబోతున్నానని తెలియగానే భాగస్వామ్యం కోసం చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపారు. దిల్ రాజు ఈ ప్రాజెక్టులో ఓ భాగంకావడంతో నేను సర్ప్రైజ్ అయ్యా. ఆయన కథ విని సినిమా ఎలా ఉంటుందో చెప్పేయగలరు. ఆయనలాంటి మేకర్ను ఉపయోగించుకోకపోతే మూర్ఖత్వమే అవుతుంది. ఆయన ఆడియన్స్ పల్స్ తెలిసిన నిర్మాత’’ అని గుణ శేఖర్ అన్నారు.
‘‘శాకుంతలం’ సినిమాని 3డీ వెర్షన్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన దిల్ రాజుగారిదే. ఈ ట్రైలర్ చూశాక ఆయన విజన్ అర్థమైంది. సమంత ఈ వేడుకకు రావాల్సి ఉంది. కానీ, సాధ్యపడలేదు. ఆమె మనసంతా ఇక్కడే ఉంది’’ అని నీలిమ గుణ పేర్కొన్నారు. ఈ సినిమాకి పని చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన సాయి మాధవ్ బుర్రా.. ఈ సినిమా ప్రేక్షకుల ఊహకు మించి ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి