Shakeela: షకీలాపై పెంపుడు కుమార్తె దాడి.. పోలీసులను ఆశ్రయించిన నటి
నటి షకీలా (Shakeela) పోలీసులను ఆశ్రయించారు. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.
చెన్నై: నటి షకీలా(Shakeela)కు చేదు అనుభవం ఎదురైంది. పెంపుడు కుమార్తె శీతల్ ఆమెపై దాడి చేసింది. ఈ మేరకు షకీలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తడంతో శీతల్ నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. చర్చించుకునేందుకు రమ్మని పిలిస్తే తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చిందని.. నచ్చ జెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆగ్రహంతో దాడికి పాల్పడిందని షకీలా ఫిర్యాదులో పేర్కొంది. ఘర్షణ జరిగిన సమయంలో అక్కడే ఉన్న మహిళా న్యాయవాదితో శీతల్ తల్లి విచక్షణారహితంగా ప్రవర్తించిందని తెలిపింది. మరోవైపు, అదే పోలీస్ స్టేషన్లో షకీలాపై శీతల్ ఫిర్యాదు చేసింది. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. శీతల్.. షకీలా అన్న కుమార్తే కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హోర్డింగ్ కూలిన ఘటన.. పరారీలో ఉన్న యజమాని అరెస్టు
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
-
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్ గెలుపు
-
ఉప్పల్ మ్యాచ్ వర్షార్పణం.. ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్.. చివరి బెర్తు ఎవరిదో?
-
భూముల మార్కెట్ విలువలు సవరించాలి: సీఎం రేవంత్