Sharathulu varthisthai: తురుమై వచ్చేయ్‌.. మెరుపై తెచ్చేయ్‌!

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి తెరకెక్కించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’.

Updated : 12 Mar 2024 09:33 IST

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి తెరకెక్కించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, కృష్ణకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. నంద కిషోర్‌, సంతోష్‌ యాదవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 15న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌ ఈ చిత్రంలోని ‘‘తురుమై వచ్చేయ్‌.. మెరుపై తెచ్చేయ్‌’’ అనే గీతాన్ని విడుదల చేశారు. అరుణ్‌ చిలువేరు స్వరాలు సమకూర్చిన ఈ పాటకు పసునూరి రవీందర్‌ సాహిత్యమందించగా.. ఎంఎల్‌ఆర్‌ కార్తికేయన్‌ ఆలపించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘కరీంనగర్‌ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. తెలంగాణ నేపథ్యంగా మరిన్ని చిత్రాలు రావాలని ఆశిస్తున్నా’’ అన్నారు. దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ.. ‘‘సమస్యలకు వెరవకుండా ఎదిరించి నిలవాలనే స్ఫూర్తిని అందించేలా ఈ పాటను రూపొందించాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని