Shraddha Kapoor: ఓ స్త్రీ మళ్లీ వస్తోంది

‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ ఓ ఊరినంత భయపెట్టిన ‘స్త్రీ’ మరోసారి తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఆ పాత్రలో అలరించిన శ్రద్ధా కపూర్‌ మరోసారి ‘స్త్రీ 2’లోనూ సందడి చేయనుంది. ఆమె, రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది.

Updated : 14 Apr 2024 13:13 IST

‘ఓ స్త్రీ రేపు రా’ అంటూ ఓ ఊరినంత భయపెట్టిన ‘స్త్రీ’ మరోసారి తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఆ పాత్రలో అలరించిన శ్రద్ధా కపూర్‌ మరోసారి ‘స్త్రీ 2’లోనూ సందడి చేయనుంది. ఆమె, రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. మంచి విజయాన్ని అందుకున్న ‘స్త్రీ’కి కొనసాగింపుగా అమర్‌ కౌశిక్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణను ప్రారంభించినట్లు తెలిపింది చిత్రబృందం. ఇందులో కీలక పాత్రలో నటిస్తున్న అభిషేక్‌ బెనర్జీ.. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘తొలిభాగం కంటే రెట్టింపు వినోదంతో ఈ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు రాబోయే సీక్వెల్‌తో మరోసారి దర్శకుడు అమర్‌ కౌశిక్‌ తను సృష్టించిన ప్రత్యేక ప్రపంచంతో సినీప్రియుల్ని ఆశ్చర్యపరుస్తారనే నమ్మకం ఉంద’ని చెప్పుకొచ్చారు. ఇందులో తమన్నా ఓ ప్రత్యేక గీతంతో కనిపించనున్నట్లు తెలుస్తుంది. త్వరలో టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 30న విడుదల కానుందీ చిత్రం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని