Salaar: ప్రభాస్, ప్రశాంత్ నీల్.. కామన్ పాయింట్ అదే: శ్రుతి హాసన్
ప్రభాస్, శ్రుతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం ‘సలార్’. ఈ సినిమా డిసెంబరు 22న విడుదలకానున్న సందర్భంగా శ్రుతి హాసన్ పలు విశేషాలు పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హీరో ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి అని హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) అన్నారు. సెట్స్లో ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటారని, అదే ఆ ఇద్దరిలో కామన్ పాయింట్ అని పేర్కొన్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘సలార్ పార్ట్ 1: సీజ్ఫైర్’ (Salaar: Part 1– Ceasefire). డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రుతి హాసన్ ఓ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
ఆ అంశాలపై ప్రభాస్తో ఎక్కువగా మాట్లాడేదాన్ని..
‘‘ఈ ఏడాది నాకెంతో ప్రత్యేకం. నేను నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతికి విడుదలై హిట్గా నిలిచాయి. ఆ తర్వాత.. మళ్లీ నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేశా. ఇయర్ ఎండింగ్లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. ‘సలార్’లో నేను ఆద్యగా కనిపిస్తా. ప్రశాంతంగా, ఓపికతో ఉండే అమ్మాయి ఆద్య. కథలో కీలకపాత్ర. ప్రశాంత్ నీల్ అద్భుతమైన దర్శకుడు. ఆయన డైరెక్షన్లో నటించడం గొప్ప అనుభూతి. సెట్స్లో ఉండే ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరిస్తారాయన. దర్శకుడిగా తనకేం కావాలో వారి నుంచి రాబట్టుకుంటారు. ప్రభాస్ దయగలవాడు. మంచి మనసున్న వ్యక్తి. అంకిత భావంతో పని చేస్తాడు. అతడు నా స్నేహితుడు అని చెప్పేందుకు సంతోషిస్తున్నా. ప్రభాస్ సెట్స్లో అడుగుపెడుతూ ఎనర్జీ తీసుకొస్తాడు. అందరూ ఆనందంగా ఉండేలా చేస్తాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్.. ఇద్దరిలో కామన్ పాయింట్ ఇదే. ప్రభాస్తో నేను ఎక్కువగా జనరల్ నాలెడ్జ్, మ్యూజిక్ గురించి మాట్లాడేదాన్ని. ఓపిగ్గా వింటూ నవ్వేవాడు’’ అని శ్రుతిహాసన్ షూటింగ్ జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
సలార్.. కథ విన్న వెంటనే ప్రభాస్కు ఫోన్ చేశా: పృథ్వీరాజ్ సుకుమారన్
అదొక విభిన్న ప్రేమకథ..
‘‘అడివి శేష్తో కలిసి నేను నటిస్తున్న సినిమా విభిన్న ప్రేమ కథతో రూపొందుతోంది. స్క్రిప్టు చదవగానే నాకు బాగా నచ్చింది. ఆ చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉంది. నేను నటించిన హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఐ’ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో ప్రదర్శితమవుతోంది. త్వరలోనే థియేటర్లలో విడుదలవుతుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా శాంతాను (స్నేహితుడు)తో సమయం గడపడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని తెలిపారు. మరోవైపు, నెగెటివిటీని వ్యాప్తి చేయొద్దంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా శ్రుతి హాసన్ పోస్ట్ పెట్టారు. ఇటీవల ఓ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేయగా పలువురు నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇలా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్పై దర్శకుడు ప్రశాంత్వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్
-
‘ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు’: బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్పై సాక్షి పోస్ట్
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM